Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

AP Telangana Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

AP Telangana Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు భారీ వర్షం, పిడుగుల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇవే.

By Ramesh Babu

Published on: August 13, 2026 9:30 AM

Updated on: August 13, 2026 9:30 AM

AP Telangana Rain Alert: Heavy Rain Warning Issued for These Districts

---Advertisement---

  •  తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
  • అల్పపీడనం బలపడుతోంది.. ఏపీ, తెలంగాణలో వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
  • బంగాళాఖాతం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలో రాబోయే వారం వర్షాలే!

AP Telangana Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మరోసారి వర్షాలు ఊపందుకునే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆగస్టు 13న రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ముఖ్యంగా పిడుగుపాటు ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షం పడుతున్న సమయంలో అవసరం లేకుండా బయటకు వెళ్లవద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో బయట ఉన్నవారు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.

Read Also : AP Nethanna Scheme : ఏపీలో నేతన్నలకు గుడ్ న్యూస్.. రూ.25 వేలు అందని వారికి మరో ఛాన్స్.. వారం రోజుల్లో జమ!

వర్షాలు, పిడుగుల సమయంలో చెట్ల కింద, విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ లైన్ల సమీపంలో నిలబడకూడదని హెచ్చరించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే వారం రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో పిడుగుల హెచ్చరిక

ఉత్తర బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ తీరాలకు దూరంగా అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 12 గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఆ తర్వాత ఈ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని తెలిపింది.

ఈ వ్యవస్థ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఏపీలో ఈ నెల 18వ తేదీ వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. శుక్రవారం కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీంతో వర్షాల సమయంలో వాహనదారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఇక గత 24 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో అత్యధికంగా 43.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కురుపాంలో 38.6 మి.మీ, పార్వతీపురంలో 36.8 మి.మీ, పాతపట్నంలో 33.4 మి.మీ, వీరఘట్టంలో 32.6 మి.మీ వర్షం కురిసింది.

అలాగే బాలాజీపేటలో 28.6 మి.మీ, పాలకొండలో 28.6 మి.మీ, రాజమండ్రిలో 28 మి.మీ, జియ్యమ్మ వలసలో 25.8 మి.మీ, భీమడోలులో 18.4 మి.మీ, పాలసీలో 18.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

తెలంగాణలోనూ వారం రోజుల పాటు వర్షాలు.. 

తెలంగాణలో కూడా వర్షాల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. రుతుపవన ద్రోణి, బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో రాబోయే వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాబోయే మూడు రోజుల్లో దిగువ స్థాయి ఉపరితల గాలుల వేగం కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది.

ఆదిలాబాద్‌, కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Read Also : KPHB Indiramma Houses : పేదలకు గుడ్‌న్యూస్.. KPHBలో 480 ఇందిరమ్మ ఇళ్లు.. రూ.5 లక్షల సబ్సిడీ.. ఆగస్టు 15లోగా అప్లై చేయండి

దీంతో ఆయా జిల్లాల ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండటం మంచిదని హెచ్చరిస్తున్నారు.

మొత్తంగా బంగాళాఖాతంలోని అల్పపీడనం బలపడుతున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలపై దీని ప్రభావం ఉండనుంది. ప్రజలు వాతావరణశాఖ సూచనలను పాటిస్తూ పిడుగులు, ఈదురుగాలుల సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.