Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Health Tips: రోజుకు ఎనిమిది గంటలకు మించి నిద్రపోతున్నారా..అయితే ఏ క్షణం అయినా చచ్చిపోతారు..?

Health Tips: సరైన నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది కాదు. ప్రతిరోజు మన శరీరానికి సరిపడినంత నిద్ర నిద్ర పోవటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామనే విషయం మనకు తెలిసిందే. అయితే

By Ramesh Babu

Published on: April 17, 2022 3:30 PM

Updated on: April 17, 2022 2:55 PM

---Advertisement---

Health Tips: సరైన నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది కాదు. ప్రతిరోజు మన శరీరానికి సరిపడినంత నిద్ర నిద్ర పోవటం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటామనే విషయం మనకు తెలిసిందే. అయితే అతిగా నిద్ర పోవడం వల్ల ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా అధిక సమయం పాటు నిద్రపోయేవారు ఏ క్షణంలోనైనా గుండెపోటుతో మరణించవచ్చని తాజాగా నిపుణులు పలు అధ్యయనాల ద్వారా వెల్లడించారు.సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవడం అవసరం. అలా కాకుండా 8 గంటలకు మించి నిద్ర పోవటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

pjimage 2022 04 17T145658.911ఈ విధంగా రోజుకు ఎనిమిది గంటల కన్నా ఎక్కువ సమయంపాటు నిద్రపోయే వారికి అధికంగా గుండె జబ్బులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోయి సరైన వ్యాయామాలు చేయడం వల్ల మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉండగలరు. ఇప్పటి వరకు చాలామంది గుండె పోటు సమస్యతో మరణించిన వారు ఉన్నారు. బ్రిటన్ లో మరణించిన వారిలో ఎక్కువగా గుండెజబ్బుతో మరణించారని వీరు కూడా ఎక్కువ సమయం పాటు నిద్ర పోవడం వల్లే మరణించారని అమెరికాకు చెందిన న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కి చెందిన అధ్యయనకారులు వెల్లడించారు.

Advertisement

కనుక మనం పదికాలాలపాటు బ్రతకాలంటే తప్పనిసరిగా శరీర వ్యాయామాలతో పాటు సరైన సమయం పాటు నిద్రపోవటం ఎంతో సురక్షితం. అలా కాకుండా రోజుకు ఎక్కువ సమయం పాటు నిద్రకే పరిమితమయితే శాశ్వత నిద్ర తీసుకోవాల్సి వస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలా రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడంతో పాటు, తప్పనిసరిగా గంట సమయం పాటు వ్యాయామం చేసినపుడే ఎంతో ఆరోగ్యంగా ఉండగలము.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.