Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

AP-Telangana issue: తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ గొడవ.. 5 గ్రామాలు మావంటే, మావంటూ!

AP-Telangana issue: ఐదు గ్రామాలు.. మహాభారత యుద్ధానికి దారి తీసిన ప్రస్తావన ఇది. ఇప్పుడే అదే పదం తెలుగు రాష్ట్రాల్లో కూడా వినిపిస్తోంది. భద్రాచలాన్ని గోదావరి ముం

By Vinod Kumar

Published on: July 21, 2022 5:00 PM

Updated on: July 21, 2022 4:15 PM

---Advertisement---

AP-Telangana issue: ఐదు గ్రామాలు.. మహాభారత యుద్ధానికి దారి తీసిన ప్రస్తావన ఇది. ఇప్పుడే అదే పదం తెలుగు రాష్ట్రాల్లో కూడా వినిపిస్తోంది. భద్రాచలాన్ని గోదావరి ముంచెత్తడంతో.. ఆ ఐదు గ్రామాల ప్రస్తావన తెర మీదు వచ్చింది. ఇంతీ ఆ ఐదు గ్రామాలు కావాలని తెలంగాణ ఎందుు కోరుతుంది. ఇప్పుడు అపీ రియాక్షన్ ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Dispute of five villages between ap and telangana

Advertisement

ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల…. ఈ ఐదు గ్రామాల గురించి ఏపీ, తెలంగాణల మధ్య గొడవ చెలరేగుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట విభజన తర్వాత… పోలవరం ముంపు మండలాల పేరుతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండాలలను ఏపీలో కలిపేశారు. అందులో భాగమే ఈ ఐదు గ్రామ పంచాయతీలు. ఈ ఐదు ఊర్లు భద్రాచలం పట్టణంలో అంతర్భాగంగా ఉన్నాయి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. భద్రాచలం నియోజకవర్గంలోని భద్రాచలం రూరల్ మండలం, కూనవరం, వీఆర్ పురం, చింతూరు మండలాలను… అలాగే పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండలంలోని కొన్ని గ్రామాలు.. అశ్వారావుపేట పరిధిలోని కుకునూరు, వేలేరుపాడు మండలాలను ఏపీలో కలిపారు. ఇలా ఈ ఐదు గ్రామాలు ఏపీ పరిధిలోకి వెళ్లిపోయాయి.

పోలవరం ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న లక్ష ఎకరాలకు పైగా భూమి తెలంగాణ నుంచి ఏపీలో విడదీసిన ఏడు మండలాల పరిధిలోనే ఉంది. అందుకే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. భద్రాచలం పట్టణాన్ని ముంపు నుంచి కాపాడేందుకే, కరకట్ట నిర్మించేందుకే ఇలా అడుగుతున్నాననేది మంత్రి వాదన. అయితే ఈ విషయానికి చాలా మంది సపోర్ట్ చేయడంతో ఈ ఐదు గ్రామాలు మాకే కావాలంటూ ఆందోళనలు చేస్తున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.