Minister Roja Selvamani : మంత్రిగా తన సత్తా ఏంటో చూపిస్తానంటున్న రోజా.. ఏం చేయనుందో మరి!

Minister Roja Selvamani : మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆర్కే రోజా తొలి సారిగా సోమవారం రోజు తన నియోజకవర్గానికి వెళ్లారు. మంత్రిగా మొదటి సారి నియోజక వర్గానికి వస్తుండటంతో ప్రజలంతా భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో చాలా సేపు నిల్చొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. నగరి ప్రజలు రాజకీయంగా జన్మనిచ్చారని తెలిపారు. అలాగే నా తల్లిదండ్రులు నాకు ఊపిరి ఇస్తే.. జగనన్న ఊహించని విధంగా మంత్రి పదవి ఇచ్చాడని పేర్కొంది. రాజకీయంగా ప్రజలకు, జగనన్నకు రుణపడి ఉన్నాని తెలిపింది. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పార్టీలోనే కొనసాగుతానని మంత్రి రోజా స్పష్టం చేసింది.

Minister Roja Selvamani
Minister Roja Selvamani

సీఎం జగన్ తనకు కేటాయించి పర్యాటక శాఖ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చే విషయంలో దృష్టిపెడతానని చెప్పారు. రోజాకు నెక్స్ట్ సీటు రాదు.. రోజా పని అయిపోయింది అని మాట్లాడిన వారి నోళ్లు మూత పడేలా ఇక్కడి ప్రజలు తనని రెండు సార్లు గెలిపించారని రోజా స్పష్టం చేశారు. అలాగే జగనన్న తనని నమ్మి మంత్రి పదవి కట్టబెట్టారని అన్నారు. 2024లోనూ జగనే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని రోజా ధీమా వ్యక్తం చేశారు.

Read Also : R.K Roja Daughter: చిన్న వయసులోనే ఎందరికో ఆదర్శంగా నిలిచిన రోజా కూతురు.. తను చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel