September 21, 2024

Devatha: ఆదిత్యకు మాట ఇచ్చిన రాధ.. అన్నం తినకుండా అలిగిన దేవి..?

1 min read
zr7yEA31

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో రాధ, ఆదిత్యకు, దేవిని దత్తత ఇస్తున్న అని చెప్పడంతో రామ్మూర్తి,జానకి, మాధవులు ఒక్కసారిగా షాక్ అవుతారు.

ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా రామ్మూర్తి ఏంటమ్మా రాద, దేవమ్మ ను ఆదిత్యకు దత్తత ఇవ్వడం ఏంటి? దేవిని విడిచిపెట్టి మేము ఉండగలమా? మన సంగతి పక్కన పెట్టు నువ్వు ఉండగలవా? అని రాధ ని నిలదీస్తాడు రామ్మూర్తి. అపుడు రాధ మాట్లాడుతూ నేను అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. మీరు ఎప్పుడూ ఆ సారు రుణం తీర్చుకోవాలి అని అంటుంటారు కదా.

zr7yEA31

నేను ఈ విధంగా ఆ సారు రుణం తీర్చుకోవాలి అని అనుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాద. ఆ తర్వాత రాద, ఆదిత్య ఎప్పుడు కలిసేచోట కలుస్తారు. అప్పుడు రాధ ఇంట్లో జరిగిన విషయం అంతా ఆదిత్యకు వివరిస్తుంది. అప్పుడు ఆదిత్య భయంతో అంటే నా బిడ్డని నాకు ఇవ్వవా అని అడగడంతో..లేదు పెనిమిటి ఇంట్లో అందరినీ ఒప్పించాను, ఇక దేవమ్మ ని ఒప్పించుడే త్వరలోనే దేవిని నీకు అప్పగిస్తాను అని మాట ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

మరొకవైపు సూరి పానకం రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అరటి తొక్కను కాళ్లమీద వేయగా పానకం వచ్చి తనపై పడుతుంది అని ఊహించుకుంటూ ఉంటాడు. తీరా చూస్తే పానకం అరటి తొక్క పై కాలు వేసి భాష మీద పడుతుంది. అప్పుడు పానకం భాష అని పేరు అడిగి సిగ్గుపడి ఎక్కడ నుంచి వెళ్లి పోతుంది. ఆ తర్వాత బయటకు వెళ్ళిన పానకం భాషను చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది.

భాషా కమల కు తినిపించడం చూసిన పానకం భాషా ని పొగడడం తో సూరి కాపాడతాడు. మరోవైపు రామ్మూర్తి ఫ్యామిలీ అందరూ కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అక్కడ అన్నం తింటూ అల్లరి చేయడంతో రాధ దేవిని తిడుతుంది. దీంతో అక్కడి నుంచి దేవి, చిన్మయి ఇద్దరు అలిగి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రామ్మూర్తి, జానకి, మాధవ లు కూడా అన్నం తినకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళి పోతారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..