Ponguleti Srinivas : టీఆర్ఎస్ పొంగులేటి గుడ్‌బై చెప్పనున్నాడా.. నిజమెంత?

Ponguleti srinivas : తెలంగాణలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది నేతలు బీజేపీలోకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇప్పటికీ పలువురు నేతలు తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. ఆగస్టు 21వ తేదీన మునుగోడు బీజేపీ భారీ బహిరంగ సభ వేదికగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అయితే ఈ సభకు హోం మంత్రి అమిత్ షా పర్యటన తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ్య చిత్రం మారుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి పలువురు బీజేపీ కండువా కప్పుకోబోతున్నారు.

Ponguleti srinivas reddy Good bye to TRS are not
Ponguleti srinivas reddy Good bye to TRS are not

అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు రిసెప్షన్ తో మరింత చర్చ నడుస్తోంది. బుధవారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు రిసెప్షన్ వేడుక ఖమ్మంలో అంగరంగ వైభవంగా జరిగింది. వందల ఎకరాల స్థలంలో, వందల కోట్ల ఖర్చుతో నిర్వహించారు. ఈ వేడుకకు లక్షలాది మంది అతిథులు తరలి వచ్చారు.

కానీ ఈ రిసెప్షన్ కు పంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏకంగా 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇంత ఘనంగా జరిగిన వేడుకకు టీఆర్ఎస్ పార్టీ నేతలెవరూ కనిపించ లేదు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఎస్ఆర్టీపీ వైఎస్ షర్మిల సహా పలువురు నేతలు మాత్రమే హాజరయ్యారు. దీంతో ఈ టాపిక్ ఉప్పుడు హాట్ గా మారింది. పొంగులేటి బీజేపీకి వెళ్లడం వల్లే గులాబీ నేతలు హాజరవలేదని తెలుస్తోంది.

Advertisement

Read Also : TDP Leaders : వ్యూహం మార్చిన టీడీపీ నేత చంద్రబాబు, ఏం చేయనున్నారు?

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel