- ఏడాదికి రూ. 5 లక్షల వరకు మాత్రమే ఉచిత వైద్య బీమా పొందవచ్చు
- ఒక ఏడాదికి ఒక్కసారే చికిత్స పొందాలి అనే పరిమితి లేదు
- ఎవరైనా ఎన్నిసార్లు అయినా చికిత్స పొందవచ్చు
- కార్డు వాడితే ఆ చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చే లెక్కలోకి వస్తుంది
- పథకం కవరేజీ మొత్తం కుటుంబం మొత్తానికి వర్తిస్తుంది
- ప్రతి ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 1 తారీఖు) కొత్తగా రూ. 5 లక్షల కవరేజీ ఉంటుంది.
Ayushman Card : మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా? లేదంటే ఇప్పుడే అప్లయ్ చేసుకోండి.. ప్రస్తుతం దేశంలో ఆయుష్మాన్ భారత్ యోజన పథకం బాగా పాపులర్ అయింది. ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్నే ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (PM-JAY) అని కూడా అంటారు.
దేశంలోని ప్రధాన ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలలో ఇదొకటి. అయితే, ఈ పథకానికి సంబంధించి నియమ నిబంధనల గురించి చాలామందికి అవగాహన లేదు. అందుకే పథకం పూర్తి ప్రయోజనాలను ఎలా పొందాలో తెలియక చాలా మంది గందరగోళంలో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
Ayushman Card : ఏడాదికి ఒకసారి మాత్రమే ఆయుష్మాన్? :
అసలు ఆయుష్మాన్ కార్డుతో సంవత్సరానికి ఒకసారి మాత్రమే ట్రీట్ మెంట్ పొందవచ్చా? అని చాలా మంది అడుగుతారు. చాలా మందిలో లబ్ధిదారుల్లో ఈ గందరగోళం కారణంగా ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు.
ప్రభుత్వం అందించే ఈ పథకం ప్రధాన ముఖ్య ఉద్దేశం.. తీవ్రమైన అనారోగ్యం సమయంలో చికిత్స అందించడమే.. అందులో పేద, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే.. అందుకే ఈ పథకం నియమాలను సరిగ్గా అర్థం చేసుకోవాలి.
ఏ చికిత్స అయినా రూ. 5 లక్షల లోపే :
ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఏడాదికి చికిత్సల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. ఒకసారి చికిత్స చేయించుకున్నాక మళ్లీ మరో చికత్సకు పనిచేయదా? అనే అనుమానం అక్కర్లేదు. ఎన్నిసార్లు అయినా ఎన్ని చికిత్సలకైనా వినియోగించుకోవచ్చు. అది కూడా రూ. 5 లక్షల పరిమితిలోపే ఉండాలి.
అవసరమైతే, లబ్ధిదారులు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఎంప్యానెల్ అయిన ఆస్పత్రిలో ఏడాదికి ఎన్నిసార్లు అయినా చికిత్స కోసమైనా వెళ్లొచ్చు. ఈ పథకం ఎన్నిసార్లు చికిత్స అనేది మాత్రమే కాదు.. మీ కవరేజ్ మొత్తం ఖర్చుకు లోబడి ఉంటుందని గమనించాలి.
ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద మీరు మొత్తం రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కవర్ పొందవచ్చు. ఈ పథకం కింద మొత్తం చికిత్సకు అయ్యే ఖర్చు ఈ పరిమితిలోపు ఉన్నంత వరకు పథకం నుంచి పూర్తి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద మీరు క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ పొందవచ్చు.
అన్ని అనారోగ్య సమస్యలకు వాడొచ్చు :
ఈ ప్రభుత్వ పథకం ప్రభుత్వ ఆస్పత్రులు, లిస్టెడ్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద అనేక రకాల తీవ్రమైన అనారోగ్యాలకు కూడా చికిత్స పొందవచ్చు. ప్రతి చికిత్సకు అందించే ఖర్చుపై మీ వార్షిక కవరేజ్ రూ. 5 లక్షల నుంచి చికిత్సను బట్టి కట్ అవుతూ వస్తుంది.
ఆయుష్మాన్ భారత్ స్కీమ్ నుంచి ఎక్కువ మంది ప్రయోజనం పొందవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడూ కాలానుగుణంగా పరిధి, ఫీచర్లను విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భారత ప్రభుత్వం అందించే ఈ ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరుతున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు ఉచితంగా చికిత్సను అందుకుంటున్నారు.













