Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Man built his grave: 20ఏళ్ల క్రితమే సమాధి, అంత్యక్రియల సామాగ్రి సిద్ధం.. ఇప్పుడు మృతి

Man built his grave: మనిషి అంటే ఓ ప్లానింగ్, ఓ డెడికేషన్, ముందు చూపు ఉండాలంటాడు రావు రమేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో. దాని అర్థం చేసే పనికి ఓ ప్లానింగ్ ఉండాలని అర్థం. ఆ డైలాగ్ పక్కాగా ఫాలో అయినట్టు ఉన్నాడు ఓ వ్యక్తి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తి చేసిన పని ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అంతలా ఆ వ్యక్తి ఏమి చేసి ఉంటాడు ... Read more

By Vinod Kumar

Published on: July 26, 2022 5:00 PM

Updated on: July 26, 2022 10:02 PM

---Advertisement---

Man built his grave: మనిషి అంటే ఓ ప్లానింగ్, ఓ డెడికేషన్, ముందు చూపు ఉండాలంటాడు రావు రమేష్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో. దాని అర్థం చేసే పనికి ఓ ప్లానింగ్ ఉండాలని అర్థం. ఆ డైలాగ్ పక్కాగా ఫాలో అయినట్టు ఉన్నాడు ఓ వ్యక్తి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తి చేసిన పని ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అంతలా ఆ వ్యక్తి ఏమి చేసి ఉంటాడు అనుకుంటున్నారా.. ఇప్పుడు ఇది చదవండి.


అది కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ తాలూకాలోని నంజేదేవనాపూర్ గ్రామం. ఆ గ్రామంలో 85 ఏళ్ల పుట్టనంజప్ప అనే వ్యక్తి చనిపోగా.. ఆయన మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసి, సమాధి చేశారు. ఇందులో ఏముంది అనుకుంటున్నారా ఇక్కడే అసలు విషయం ఉంది. ఆ సమాధి కట్టించిన వ్యక్తి మృతదేహాన్ని ఇప్పుడు సమాధి చేశారు. పుట్టనంజప్పకి ముగ్గురు పిల్లలు. ముగ్గురూ ఆర్థికంగా బాగా స్థిరపడ్డవారే. పుట్టనంజప్పకు స్వతంత్ర్య భావాలు ఎక్కువ. 20 ఏళ్ల క్రితమే తన సమాధిని తనే కట్టించుకున్నాడు. ఇసుకతో దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాను చనిపోయిన తర్వాత తన సమాధి అదే చోట పాతిపెట్టాలని, అది తన కొడుకులపై ఆర్థిక భారాన్ని మోపకూడదని అనుకున్నాడు పుట్టనంజప్ప. తాను చనిపోతే తాను స్వయంగా కట్టుకున్న సమాధిలోనే తన శవాన్ని పాతిపెట్టాలని కుటుంబసభ్యులకు చెప్పాడు. పుట్టనంజప్ప 12 రోజుల క్రితం అస్వస్థకు గురై చనిపోగా.. తను కట్టుకున్న సమాధిలోనే పుట్టనంజప్పను సమాధి చేశారు కుటుంబసభ్యులు

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.