వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Hyderabad Crime : హైదరాబాద్ నడిబొడ్డున మరో పరువు హత్య.. కూతురు ముందే భర్తను దారుణంగా చంపిన వైనం!

Hyderabad Crime : హైదరాబాద్ నడిబొడ్డున పరువు హత్య జరిగింది. కూతురు చూస్తుండగానే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిని అతి దారుణంగా చంపిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు (25), ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా అలియాస్ పల్లవి (23) ప్రేమించుకుంటున్నారు. వీరి మతాలు వేరైనా మనసులు మాత్రం ఒక్కటయ్యాయి. ఇద్దరు ఒకరి పై ఒకరు అమితమైన ప్రేమను పెంచుకుని ... Read more

By Ramesh Babu

Published on: May 5, 2022 6:30 PM

Updated on: May 6, 2022 12:30 AM

---Advertisement---

Hyderabad Crime : హైదరాబాద్ నడిబొడ్డున పరువు హత్య జరిగింది. కూతురు చూస్తుండగానే తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిని అతి దారుణంగా చంపిన ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు (25), ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా అలియాస్ పల్లవి (23) ప్రేమించుకుంటున్నారు. వీరి మతాలు వేరైనా మనసులు మాత్రం ఒక్కటయ్యాయి. ఇద్దరు ఒకరి పై ఒకరు అమితమైన ప్రేమను పెంచుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారు.

Hyderabad Crime
Hyderabad Crime

అయితే ఈ విషయం ఆశ్రిన్ ఇంటిలో తెలియడంతో నాగరాజుకు ఆమె కుటుంబసభ్యులు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇద్దరూ కలిసి ఇల్లు వదిలి పోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే బ్రతుకుతెరువు కోసం ముందుగా ఉద్యోగం చేయాలనుకున్నా నాగరాజు హైదరాబాద్లో ఓ కార్ల షోరూం సేల్స్ మెన్ గా పనిచేశారు. ఇక తనకు ఉద్యోగం వచ్చిందనే విషయాన్ని ఆశ్రిన్ కి చెప్పగా వీరిద్దరూ ఇల్లు వదిలి పారిపోయి హైదరాబాదులో ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు.

ఆశ్రిన్ ఇంటి నుంచి తమకు సమస్య ఎదురవుతుందని గ్రహించిన వీరిద్దరూ హైదరాబాద్ వదిలి విశాఖపట్నం చేరుకున్నారు. అయితే వధువు కుటుంబ సభ్యులు హైదరాబాద్లో వీరి కోసం ఎన్నో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆశ్రిన్ కుటుంబ సభ్యులు తమ కోసం వెతకడం లేదని తెలుసుకున్న ఈ జంట తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్న వీరు సరూర్ నగర్‌లోని పంజా అనిల్ కుమార్ కాలనీలోని ఓ అద్దెకి ఇంటిని తీసుకుని అక్కడ నివసిస్తున్నారు.

ఈ జంట హైదరాబాద్ వచ్చారని తెలుసుకున్న ఆశ్రిన్ కుటుంబ సభ్యులు వీరి కదలికలపై నిఘా ఉంచారు. ఈ క్రమంలోనే గురువారం రాత్రి వీరిద్దరూ కలిసి బైక్‌పై వెళ్తుండగా జీహెచ్ఎంసీ రోడ్డు ప్రాంతంలో ఓ వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. బండి ఆపిన వెంటనే ఓ వ్యక్తి గడ్డ పార తీసుకొని నాగరాజును అతి దారుణంగా పొడిచి చంపిన ఘటన చోటు చేసుకుంది.అయితే తన భర్తని చంపింది తన సోదరుడు అని పోలీసులకు ఆశ్రిన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తనని అదుపులోకి తీసుకున్నారు.

Read Also : Babu Gogineni: దేవి నాగవల్లి, విశ్వక్ సేన్ మేటర్ లోకి ఎంటరైన బాబు గోగినేని.. తప్పెవరిది?

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel