Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Road accident: ఇంటర్ ఫలితాల్లో జిల్లా టాపర్.. ఆఖరి పరీక్ష రాసిన నాడే అనంత లోకాలకు!

Road accident: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ముగాలకు చెందిన రాజేశ్వరికి చిన్నప్పటి నుంచి చదువంటే ప్రాణం. ఒకటో తరగతి నుంచి ఆమె చదువులో ఎప్పుడూ ముందే ఉండేది. జిల్లా కేంద్రంలోని గొనుపాడు కేజీబీవీ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. నెల క్రితం జరిగిన ఇంటర్ పరీక్షలన్నీ చాలా బాగా రాసింది. అనుకున్నట్లుగానే జిల్లా టాపర్ అయింది. కానీ సంతోషించేందుకు ఆమె ప్రస్తుతం ప్రాణాలతో లేదు. చివరి పరీక్ష రాసిన రోజే తండ్రితో పాటు ... Read more

By Vinod Kumar

Published on: June 29, 2022 7:25 PM

Updated on: June 30, 2022 5:53 PM

---Advertisement---

Road accident: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ముగాలకు చెందిన రాజేశ్వరికి చిన్నప్పటి నుంచి చదువంటే ప్రాణం. ఒకటో తరగతి నుంచి ఆమె చదువులో ఎప్పుడూ ముందే ఉండేది. జిల్లా కేంద్రంలోని గొనుపాడు కేజీబీవీ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. నెల క్రితం జరిగిన ఇంటర్ పరీక్షలన్నీ చాలా బాగా రాసింది. అనుకున్నట్లుగానే జిల్లా టాపర్ అయింది. కానీ సంతోషించేందుకు ఆమె ప్రస్తుతం ప్రాణాలతో లేదు. చివరి పరీక్ష రాసిన రోజే తండ్రితో పాటు ఓ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

Advertisement

అయితే మంగళ వారం వెలువడిన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో రాజేశ్వరికి 867 మార్కులు వచ్చాయి. జిల్లాలోని కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థినుల్లో రాజేశ్వరి టాప్ గా నిలిచింది. అయితే అభినందించేందుకు రాజేశ్వరి ప్రాణాలతో లేకపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. చదువులో ఎప్పుడూ ముందంజలో ఉండే ఆమె ప్రతిభ తలుచుకొని కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.