Petrol Prices Today : భారత దేశంలో ఇంధన ధరలు నాలుగో రోజూ కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. 20 రోజుల వ్యవధిలో దాదాపు 17 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి చమురు సంస్థలు. అిచే గురువారం నుంచి కాస్త విరామం ఇచ్చాయి. గురువారం నుంచి నేటి వరకు ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.45, లీటర్ డీజిల్ ధర రూ. 96.71గా ఉంది.
ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.120.5 చేరగా, లీటర్ డీజిల్ రూ. 104.75గా ఉంది. వైజాగ్లో లీటర్ పెట్రోల్ రూ. 119.98గా ఉండగా, లీటర్ డీజిల్ రూ. 105.63గా కొనసాగుతోంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.119.47 వద్ద కొనసాగుతుండగా, లీటర్ డీజిల్ ధర రూ. 105.47గా ఉంది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.121.24కు చేరింది. డీజిల్ ధర రూ.106.91కు చేరుకుంది. వైజాగ్లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.88కు చేరుకుంది. డీజిల్ ధర రూ.105.66కు ఎగ బాకింది.
Read Also : Petrol Prices Today : స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎక్కడ ఎంతో తెలుసా?