...

Petrol rate hike: లీటర్ పెట్రోల్ ధర 84 రూపాయలు పెంపు.. ఎక్కడో తెలుసా?

అసలే ఆక్థిక వ్యవస్థ సమస్యలతో బాధపడుతున్న పాకిస్థన్ ప్రజలకు మరో సమస్య వచ్చి పడింది. దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఆయిల్​ అండ్​ గ్యాస్​ అథారిటీ సూచనల మేరకు ఇంధన ధరలను పెంచాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి శనివారం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని షెహబాజ్​ షరీఫ్​ ప్రభుత్వం ప్రటించింది. ఇందులో భాగంగానే లీటరు పెట్రోల్​పై రూ. 83.5, డీజిల్​పై రూ.119 పెరిగే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

Advertisement

అంతే కాకుండా లైట్​ డీజిల్​పైన రూ.77.31, కిరోసిన్​పైన రూ.36.5 పెంచాలని భావిస్తోంది పాక్​ ప్రభుత్వం. ఈ ధరలు అమలైతే పాక్​ ప్రజలకు ఇంధనం మరింత భారంగా మారుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్​లో పెట్రోల్​, డీజిల్​పై 17 శాతం జీఎస్​టీ వసూలు చేస్తుండగా దీనిని 70 శాతానికి పెంచాలని ఓజీఆర్​ఏ ప్రతి పాదించింది. ఈ ధరలపై ప్రధాని షెహబాజ్​ షరీఫ్​ను సంప్రదించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ ధరలే కనుక అమలు అయితే పాకిస్థాన్ ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

Advertisement
Advertisement