Viral Video : నిద్రపోతున్న భార్యను లేపి మరీ రైలు కిందకు తోశాడు.. ఏమైందంటే? షాకింగ్ వీడియో వైరల్!

Viral Video: మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. పడుకున్న భార్యను లేపి మరీ వెళ్తున్న రైలు కింద తోసేశాడు. ఆపై పిల్లలను ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ముంబయి సమీపంలోని వసాయ్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది.

ఆదివారం మధ్యాహ్నం నుంచి నిందితుడు, మృతురాలు, పిల్లలు అక్కడ ఉన్నారు. రాత్రి సమయంలో అక్కడే బల్లపై నిద్ర పోయారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారు జామున ఆ వ్యక్తి మహిళను నిద్ర లేపాడు. కొంత సమయం మాట్లాడాడు. అదే సమయంలో స్టేషన్ లోకి వస్తున్న అవధ ఎక్స్ ప్రెస్ కిందకు ఆమెను గట్టిగా తోసేశాడు. ఆపై పిల్లలిద్దరినీ వెంట బెట్టుకొని వెళ్లిపోయాడు.

Advertisement

Advertisement

అయితే కేసు దర్యాప్తు చేసిన పోలీసులలకు నిందితుడు దాదర్ వెళ్లినట్లు.. ఆ తర్వాత కల్యాణ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. చివరకు భీవండిలో పోలీసులకు చిక్కాడు. కాగా.. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద వాసాయ్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel