- T20 ప్రపంచ కప్ మ్యాచ్లో ఆతిథ్య జట్టు అద్భుత ప్రదర్శన
- గ్రూప్ A మ్యాచ్లో నమీబియాపై భారత్ 93 పరుగుల తేడాతో ఘన విజయం
- ఇషాన్ కిషన్ అద్భుతమైన 61 పరుగులతో టీమిండియా విజయతీరాలకు
- హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ ప్రతిభ, 28 బంతుల్లో 52 హాఫ్ సెంచరీ
T20 WC 2026 IND vs NAM : T20 ప్రపంచ కప్ 2026లో నమీబియాపై 93 పరుగుల తేడాతో భారత్ భారీ ఘనవిజయం సాధించింది. యూఎస్ఏ, నమీబియాలను ఓడించాక టీమీండియా సూపర్ 8లో దాదాపు బెర్త్ ఖాయం అయినట్టే. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది.
కానీ, ఆ తర్వాత 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 116 పరుగులకే చేతులేత్తేసింది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇషాన్ 24 బంతుల్లో 61 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 28 బంతుల్లో 52 పరుగులు చేసి, 2 వికెట్లు కూడా పడగొట్టారు.
T20 WC 2026 : భారత్ మ్యాచ్ ఎలా గెలిచిందంటే? :
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోగా భారత్ను ముందుగా బ్యాటింగ్కు ఆహ్వానించారు. సంజు సామ్సన్, ఇషాన్ కిషన్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. సంజు సామ్సన్ 3 సిక్సర్లు, ఒక 4 కొట్టాడు. కానీ, 22 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 24 బంతుల్లో 61 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 25 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 12 పరుగులు చేసి విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్ ఝళిపించాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి అద్భుత ప్రదర్శన చేశాడు. కానీ తర్వాతి బంతికే 52 పరుగుల వద్ద ఔటయ్యాడు.
అయితే, టీమీండియా మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. రింకు సింగ్ కేవలం ఒక పరుగు మాత్రమే చేయగలిగాడు. అక్షర్ పటేల్ మొదటి బంతికే ఔటయ్యాడు. శివమ్ దుబే 23 పరుగులు చేసినా బ్యాటింగ్ చేయలేకపోయాడు. నమీబియా తరఫున కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 4 వికెట్లు పడగొట్టాడు.
వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన :
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అత్యుత్తమ ప్రదర్శనతో నిలిచాడు. స్పిన్నర్ కేవలం 12 బంతుల్లో 7 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలో 2 వికెట్లు పడగొట్టారు.
అర్ష్దీప్ సింగ్, శివమ్ దుబే, జస్ప్రీత్ బుమ్రా తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో, టీమిండియా గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచింది. దాంతో సూపర్ 8 దశకు చేరుకుంది. భారత్ తర్వాత మ్యాచ్ ఫిబ్రవరి 15న పాకిస్తాన్తో జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా కొలంబోకు వెళ్లనుంది.
















