వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

BJP Focus: టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తున్న బీజేపీ.. ఏం చేయబోతున్నారు?

BJP Focus: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రానికి చెందిన మరో ఎంపీకి కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టాలని హైకమాండ్ చూస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో ఐదుగురు బీజేపీ ఎంపీలు ఉండగా.. మంత్రి పదవి ఎవరికి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి పదవి ఇవ్వాలనే ఆలోచనలో కమలం పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎంపీలు బండి ... Read more

By Vinod Kumar

Published on: September 6, 2022 6:00 PM

Updated on: September 6, 2022 5:40 PM

---Advertisement---

BJP Focus: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. అందులో భాగంగానే రాష్ట్రానికి చెందిన మరో ఎంపీకి కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టాలని హైకమాండ్ చూస్తున్నట్లు సమాచారం. అయితే రాష్ట్రంలో ఐదుగురు బీజేపీ ఎంపీలు ఉండగా.. మంత్రి పదవి ఎవరికి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి పదవి ఇవ్వాలనే ఆలోచనలో కమలం పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దీంతో ఎంపీలు బండి సంజయ్, లక్ష్మణ్, అర్వింద్ లో ఎవరికి ఛాన్స్ వస్తుందనేది సస్పెన్స్ గా మారింది.

ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకునేందుకు అన్ని రకాల ఎత్తులు వేస్తున్నారు. పార్టీ స్పెషల్ ఫోకస్ అంతా తెలంగాణపైనే ఉందనే స్పష్టతను ఇచ్చేందుకు జాతీయ కార్యవర్గ సమావేశాలను సైతం ఇక్కడే నిర్వహిస్తోంది. కేంద్ర మంత్రులను ఎప్పటికప్పుడు రాష్ట్రానికి పంపిస్తూ పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిత్యం సెన్సేషనల్ కామెంట్లు చేస్తూ.. వార్తల్లో నిలిచే ఎంపీ ధర్మపురి అర్వింద్ కు కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఆయన అయితే కవిత, కేసీఆర్ లను ఓడించగలరని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరగనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel