Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి డీఏ పరిగే అవకాశం.. పండగే ఇక!

DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం అంటే డీఏ. డీఆర్ లు మళ్లీ పెరిగే అవకాశం ఉందట. పలు మీడియా నివేదికల ప్రకారం వచ్చే నెల ప్రారంభంలో ఈ విష

By Vinod Kumar

Published on: June 24, 2022 4:00 PM

Updated on: June 24, 2022 5:14 PM

DA Hike for central government employees

---Advertisement---

DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం అంటే డీఏ. డీఆర్ లు మళ్లీ పెరిగే అవకాశం ఉందట. పలు మీడియా నివేదికల ప్రకారం వచ్చే నెల ప్రారంభంలో ఈ విషయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 1 నుంచి అమల్లోకి రాబోతున్నట్లు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం, సంబంధిత భత్యం పెంపు ఫలితంగా … కేంద్ర ప్రబుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వేతనాలు పెరుగుతాయని నివేదికలు పేర్కొన్నాయి. డీఏ డీఆర్ లను సాధారణంగా ప్రభుత్వం జనవరి, జులైలో వరిస్తుంది. డీఏ, డీఆర్ అనేవి ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే జీతం. పెన్షన్ లోని బాగాలు ఆకాశాన్ని అంటుతున్న వేళ… ద్రవ్యోల్బణం మధ్య వివి వర్గాల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, డీఆర్ లు పెంచితే వారికి పెద్ద ఉపశమనం కల్గుతుంది.

DA Hike
DA Hike

కార్మిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దాదాపు 1.15 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ నిర్ణయం ద్వారా లభ్ది పొందనున్నారు. 2020 జనవరి నుంచి జూన్ 30, 2021 వరకు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపును ఆపింది. ఆ తర్వాత డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచారు. 2021 అక్టోబర్ లో డీఏ మళ్లీ 3 శాతం నుంచి 31 శాతానికి పెరిగింది. ఈ ఏడాది జనవరిలో భృతిని 34 శాతానికి పెంచారు.

Advertisement

Read Also :

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :