Devatha Serial : గుడిలో పడిపోయిన రుక్మిణీ.. ఆదిత్య ఏం చేయనున్నాడు..?

Updated on: March 9, 2022

Devatha Serial March 8th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. శివరాత్రి పండుగ సందర్భంగా ఆదిత్య, సత్య లు, రుక్మిణీ, మాధవ లు శివాలయానికి వెళ్తారు. ఒకవైపు ఆదిత్య,సత్య లు మరొకవైపు రుక్మిణి, మాధవ లు గుడికి వెళ్తారు. ఈ క్రమంలోనే ఆదిత్య రుక్మిణి తో ఎలా అయినా మాట్లాడాలి అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ రుక్మిణీ మాత్రం ఆదిత్య దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు సత్య రాధ తో మాట్లాడుతూ.. పిల్లలు పుట్టాలి అని ఉపవాసం ఉన్నాను అక్క అని చెబుతుంది.

Devatha Serial March 8th Today Episode
Devatha Serial March 8th Today Episode

ఆ తర్వాత గుడిలో రాధకు కళ్ళు తిరిగి పడిపోవడం తో కంగారుపడ్డ ఆదిత్య రాధా,రాధా అంటూ పరుగులు తీస్తాడు. సత్య కూడా తన అక్కను నిద్రలేపి ప్రయత్నం చేస్తుంది. మరోవైపు దేవి రాధా లేదు అని ఏడుస్తూ ఉండగా జానకి వచ్చి నేను ఉన్నాను అమ్మ అని ప్రేమగా చెబుతుంది. రాధా కళ్ళు తెరచి చూసే సరికి ఆదిత్య కనిపిస్తాడు. ఏంటి రాధా ఉపవాసం ఉన్నావా అని ఆదిత్య అడగగా అవును పెనివిటి మీకు పిల్లలు పుట్టాలని ఉపవాసం ఉన్నాను అని చెబుతుంది రాద.

అప్పుడు ఆదిత్య నాకు పిల్లలు అయితే నేను దేవి జోలికి రాను అని ప్లాన్ వేసావా అంటూ అవమానంగా మాట్లాడతాడు. ఇంతలో సత్య నీరు తీసుకొని వస్తుంది.అప్పుడు రాధ నీరు కూడా తాగను.. బాగానే ఉంది అని చెబుతుంది. అప్పుడు సత్య ఎందుకు అక్క ఇంత కటిక ఉపవాసం అని అడగగా.. మనకు పిల్లలు పుట్టాలంటే మొక్కుకుందట అని ఆదిత్య చెబుతాడు. ఇక సత్య రాధ ని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది.. ఇంతలో మాధవ అక్కడికి వచ్చి ఉన్నావా రాధా వెళ్దాం రా అని అంటాడు. సత్య, రాధ లు కలసి దీపాలు వెలిగించడానికి వెళతారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Devatha Serial March 7 Today Episode : తప్పు తెలుసుకున్న సత్య.. ఆదిత్య ఏం చేయనున్నాడు..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel