Viral video: అడవిలో మృగరాజునే భయపెట్టిన పంది.. అట్లుంటది మనతోని అంటున్న అడవి పంది

Viral video: సింహాలు అడవికి రాజులు. అందుకే వాటిని మృగరాజు అని పిలుస్తారు. సింహాలు చాలా శక్తివంతమైనవి అలాగే చాలా ప్రమాదకరమైనవి కూడా. అడవిలో వీడి ఆధిపత్యమే ఎక్కువగా ఉంటుంది. మిగతా జంతువులు వీటిని చూస్తే భయపడిపోతాయి. జూలు విదుల్చుకుంటూ అడుగులు వేస్తుంటే పై ప్రాణాలు పైకే పోవడం ఖాయం.

పందులు కూడా ప్రమాదకరమైనవే. ముఖ్యంగా మాములు పందులకంటే కూడా అడవి పందులు చాలా వైల్డ్ గా ఉంటాయి. ఇవి చాలా సార్లు అడవులను వదిలి పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తుంటాయి. వీటి బారిన పడే వారి ప్రాణాలు గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఇవీ చాలా కోపంగా ఉంటాయి.

Advertisement

అడవిలో మాత్రం సింహాలు అంటే పందులకు సుస్సు అనే చెప్పాలి. సింహాలను చూస్తే ఇవి పారిపోతాయి. కానీ అలాంటి మృగారాజును సుస్సు పోయించింది ఓ పంది. సింహానికి చుక్కలు చూపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువ షేర్లు అందుకుంటోంది.

ఈ వీడియోలో అడవి పంది సింహంపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. సింహం, పంది దాడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండటాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. దీనిలో సింహంపై పంది దాడి చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో సింహానికి ఏం చేయాలో అర్థం కాక.. వెనక్కి వెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది. సింహాన్ని చూడగానే మిగిలిన జంతువులు వెంటనే పారిపోతుండగా… పంది దానితో పోరాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel