October 5, 2024

Keerthy Suresh: మహేష్ బాబు కోసం ఎదురుచూస్తున్న కీర్తి సురేష్.. డబ్బింగ్ పూర్తి చేసుకున్న మహానటి!

1 min read
pjimage 2022 05 02T135929.469

Keerthy Suresh: కీర్తి సురేష్ మహేష్ బాబు జంటగా నటిస్తున్న సినిమా ” సర్కారు వారి పాట”. మైత్రి మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఎంతో కాలం గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మహేష్ సినిమా ఇది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అవటంతో వాయిదా పడింది.మహేష్ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే పాటలు, పోస్టర్స్, విడుదల అయ్యి సినిమా మీద ప్రేక్షకుల అంచనాలను పెంచేశాయి.

తమన్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు ఒక ప్లస్ పాయింట్. ఈ సినిమా నుండి విడుదలైన కళావతి అనే పాట ఇప్పటికే మిలియన్ వ్యూస్ సాధించి రికార్డు సృష్టించాయి.మే 12వ తేదీ విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్ వేగవంతం చేశారు. ఎప్పటికప్పుడు సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేస్తూ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ కు జోడీగా నటించిన కీర్తి సురేష్ ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

కీర్తి సురేష్ తన ట్విట్టర్ ద్వారా మహేష్ అభిమానులు ఆనందపడే విషయాలు షేర్ చేసింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేసినట్టు ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. అంతే కాకుండా అందరి అభిమానుల్లగ నేను కూడా సినిమాలో మహేష్ ని చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. మహేష్ అభిమానులకు పక్కా ట్రీట్ ఉంటుందని ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతే కాకుండా డబ్బింగ్ స్టూడియోలో డబ్బింగ్ చెప్పేటప్పుడు తీసిన ఫోటో కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. చాలా కాలం తర్వాత తమ అభిమన హీరో సినిమా రిలీజ్ అవతుండటంతో మహేష్ అభిమానులందరూ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.