Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Guppedantha Manasu: సాక్షిని అసహ్యించుకున్న రిషి.. రిషి విషయం గురించి ఎమోషనల్ అవుతున్న జగతి, మహేంద్ర..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిం

By Ramesh Babu

Published on: August 10, 2022 10:43 AM

Updated on: August 10, 2022 10:43 AM

---Advertisement---

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవయాని, సాక్షి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి వసు, జగతి వస్తారు.

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార జగతి అక్కడికి రావడంతో వెంటనే సాక్షి కోపంతో రగిలిపోతూ ఇదంతా నీ వల్లనే జరిగింది. నా లైఫ్ ఇలా అవ్వడానికి కారణం నువ్వే అంటూ వసుని తిడుతూ ఉండగా ఇంతలోనే రిషి అక్కడికి వచ్చి సాక్షిని అసహ్యించుకొని కోపంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వసుధార జగతితో మాట్లాడుతూ రిషి సార్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడో నేను అడుగుతాను అని అనగా అప్పుడు జగతి వద్దు అని అంటుంది.

Advertisement

vasudhara tries to convince rishi to change his decision in todays guppedantha manasu serial episode

ఆ తర్వాత వారిద్దరు మాట్లాడుకున్న తర్వాత వసు ఆలోచిస్తూ కిందికి వెళ్తూ మెట్లు జారి కింద పడిపోతూ ఉండగా ఇంతలోనే రిషి వచ్చి పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. అప్పుడు రిషి చూసుకుని వెళ్లొచ్చు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహేంద్ర, తీసుకున్న నిర్ణయం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ అసలు రిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు.

ఇంతలోనే దేవయాని అక్కడికి వచ్చి ధరణితో అందరికీ సీట్స్ తీసుకొని రమ్మని చెబుతుంది. అప్పుడు మహేంద్ర ఎందుకు ఈ హడావిడి వదిన అని అనగా రేపు సాక్షి వాళ్ళ అమ్మానాన్న ముహూర్తం పెట్టుకోవడానికి వస్తున్నారు అని చెప్పడంతో వారందరూ షాక్ అవుతారు. అప్పుడు మహేంద్ర దేవయానితో మాట్లాడుతూ ఎలా అయినా ఈ పెళ్లి ఆగిపోయేలా చెయ్ వదినా అని అంటాడు.

అప్పుడు ధరణి గౌతమ్ తో మాట్లాడుతూ ఇదంతా అత్తయ్య డ్రామా అని అంటుంది. అప్పుడు మహేంద్ర దేవయానికి ఎంత చెప్పినా కూడా వినిపించుకోదు. ఆ తర్వాత రిషి కార్లో వెళ్తూ ఉండగా వసుధర వెళ్లి అడ్డుపడి రిషి సాక్షి విషయంలో తప్పు నిర్ణయం తీసుకున్నారు అనీ వసునీ మార్చే ప్రయత్నం చేస్తుంది. సాక్షి గతంలో మీకు చేసిన విషయాలన్నీ మర్చిపోయారా అని అడుగుతుంది.

Advertisement

మరొకవైపు జగతి దంపతులు రిషి నిర్ణయం గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటారు. అప్పుడు జగతి వాళ్ళు మాట్లాడుకుంటూ ఎందుకు రిషి ఇలా చేస్తున్నారు అని బాధపడుతూ ఉంటారు.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.