Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

నరసాపురంలో నవ్వుల పాలయ్యేది ఎవరు..?

ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఉప ఎన్నిక జరగబోతోంది.ఈ ఏడాది చివర్లోనే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వైసిపి రెబెల్ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు వచ్చే నెల 5వ తేదీ తర్వాత రాజీనామా చేయనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో మార్చి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఆ సమావేశాల తర్వాతనే బహుశా రఘురామకృష్ణంరాజు రాజీనామా ఉండవచ్చు.రాజీనామా చేసిన ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లోగా నర్సాపురం ... Read more

By Ramesh Babu

Published on: January 17, 2022 1:20 PM

Updated on: January 17, 2022 10:59 AM

---Advertisement---

ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఉప ఎన్నిక జరగబోతోంది.ఈ ఏడాది చివర్లోనే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వైసిపి రెబెల్ ఎంపీ రఘు రామ కృష్ణంరాజు వచ్చే నెల 5వ తేదీ తర్వాత రాజీనామా చేయనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో మార్చి 14వ తేదీ వరకు జరగనున్నాయి. ఆ సమావేశాల తర్వాతనే బహుశా రఘురామకృష్ణంరాజు రాజీనామా ఉండవచ్చు.రాజీనామా చేసిన ఆరు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది.అంటే ఈ ఏడాది సెప్టెంబర్ లోగా నర్సాపురం పార్లమెంటు ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది.

అయితే ఆయన ఏ పార్టీ నుండి పోటీ చేస్తాడో డిసైడ్ అయ్యారు.రాజీనామా చేసిన వెంటనే ఆ పార్టీలో చేరుతారు.ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసిన వైసీపీయేతర పార్టీల సహకారం తీసుకున్నారు. వైసీపీ వర్సెస్ రఘురామకృష్ణంరాజు లాగానే ఎన్నిక జరిగేలా ఆయన చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ కొమ్ములు వంచాలంటే ఈ ఎన్నికల్లో వైసీపీని ఓడగొట్టాలి.అందుకే ఆయన అడక్కపోయినా అన్ని పార్టీల నుండి మద్దతిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నరసాపురంలో గత ఎన్నికల్లోనే వైసీపీకి పెద్దగా మెజారిటీ రాలేదు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు కేవలం 35 వేల ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు.

నరసాపురంలో సామాజికవర్గాల పరంగా చూసిన ప్రత్యర్థులను తక్కువంచనా వేయలేం. క్షత్రియులు, కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఇద్దరు కలిస్తే వైసీపీకి విజయం కష్టమే.అందుకే లెక్కలు వేసుకుని మరీ రాజుగారు బరిగీసారు. జగన్ కు కూడా ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. తనను కాదని కాలుదువ్వి వెళ్ళిన రాజు గెలిస్తే తన పరువు గోదారిలో కలవడం కాయం.ఈ ఎఫెక్ట్ 2024 ఎన్నికల్లో కచ్చితంగా కనబడుతుంది. మొత్తంమీద రఘురామ కృష్ణంరాజు జగన్ కు పెద్ద పరీక్ష పెట్టారనే చెప్పాలి.ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఇక జగన్ కు వచ్చే ఎన్నికల్లో తిరుగులేనట్లే.

,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!