Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Telangana Ration Card : తెలంగాణ రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. 3 నెలల ఉచిత బియ్యానికి ఈరోజే లాస్ట్..

Telangana Ration Card : తెలంగాణలో రేషన్ కార్డుదారులకు ముఖ్య అలర్ట్. మూడు నెలల ఉచిత బియ్యం కోటా గడువు నేటితో ముగియనుంది. మొబైల్‌తో ఈ-కేవైసీ పూర్తి చేసే విధానం తెలుసుకోండి. ఈరోజే తమ కోటాను తీసుకోవడంతో పాటు, వీలైతే ఈ-కేవైసీని కూడా పూర్తి చేసుకోవడం మంచిదని పౌరసరఫరాల విభాగం సూచిస్తోంది. ఆలస్యం చేస్తే నష్టపోయేది మీరే.

By Ramesh Babu

Published on: September 5, 2026 10:41 AM

Updated on: September 5, 2026 10:42 AM

Telangana Ration Card

---Advertisement---

  • రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ రోజే గడువు.. లేదంటే మీ వాటా మిస్!
  • బియ్యం కోటా తీసుకోలేదా? ఇవాళ సాయంత్రంలోపే ఆఖరి ఛాన్స్
  • రేషన్ షాపుకు వెళ్లేముందు ఇది చదవండి.. 3 డు నెలల కోటాపై కీలక అప్‌డేట్
  • మొబైల్‌తోనే ఈ-కేవైసీ.. రేషన్ కార్డుదారులకు ఈజీ టిప్స్, ఈరోజే డెడ్‌లైన్

Telangana Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. గత మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఉచిత బియ్యం కోటాను ఒకేసారి తీసుకునే అవకాశం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది. ఇప్పటివరకు తమ కోటాను తీసుకోని కుటుంబాలు ఆలస్యం చేయకుండా సమీపంలోని రేషన్ డీలర్ వద్దకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. గడువు దాటితే గత నెలల సరుకులు మళ్లీ రావని స్పష్టం చేస్తున్నారు.

మూడు నెలల బియ్యం ఒకేసారి

వాస్తవానికి ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు అందాల్సిన బియ్యాన్ని ప్రభుత్వం ఒకే విడతలో పంపిణీ చేయాలని నిర్ణయించింది. రానున్న ధాన్యం కొనుగోళ్ల కోసం గిడ్డంగులను ఖాళీ చేయాల్సిన అవసరం ఉండటంతో పాటు, వాతావరణ పరిస్థితుల కారణంగా లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

అయితే మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయడంతో రేషన్ కేంద్రాల వద్ద రద్దీ భారీగా పెరిగింది. దీంతో అధికారులు బియ్యం తీసుకునే గడువును సెప్టెంబర్ 5వ తేదీ వరకు పొడిగించారు. ఆ పొడిగించిన గడువు కూడా నేటితో ముగియనుంది.

వెంటనే కోటా తీసుకోవాలి

ఇప్పటికీ బియ్యం తీసుకోని కుటుంబాలు ఈరోజే తమ సమీప రేషన్ డీలర్‌ను సంప్రదించడం మంచిది. గడువు ముగిసిన తర్వాత గత నెలల సరుకులు మళ్లీ అందుబాటులోకి రావని అధికారులు చెబుతున్నారు. అందువల్ల చివరి రోజు వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా రేషన్ స్టాక్ తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇంటి నుంచే రేషన్ కార్డు ఈ-కేవైసీ

ఇదే సమయంలో రేషన్ కార్డు ఈ-కేవైసీని కూడా ఇంటి నుంచే పూర్తి చేసుకునే సౌకర్యాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్ ఉంటే సరిపోతుంది.

ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి Mera eKYC, Aadhaar Face RD యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్‌ను తెరిచి రాష్ట్రాన్ని ఎంపిక చేసి, రేషన్ కార్డులోని సభ్యుల వివరాలను నమోదు చేయాలి. అనంతరం ఫోన్‌కు వచ్చిన ఆరు అంకెల ఓటీపీని ఎంటర్ చేసి, స్క్రీన్‌పై కనిపించే సెక్యూరిటీ కోడ్‌ను సబ్మిట్ చేయాలి.

Advertisement

Read Also : Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? జర జాగ్రత్త.. ఈ పని చేయకుంటే కార్డు రద్దు అవుతుంది.. ఇప్పుడే చెక్ చేసుకోండి!

తర్వాత కెమెరా ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. మంచి వెలుతురు ఉన్న ప్రదేశంలో నిలబడి స్క్రీన్‌పై కనిపించే సర్కిల్‌లో ముఖాన్ని సరిగ్గా అమర్చాలి. గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కనురెప్పలు కదిలిస్తే ఫేస్ అథెంటికేషన్ పూర్తవుతుంది.

కాబట్టి రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈరోజే ఉచిత బియ్యం కోటాను తీసుకోవడంతో పాటు, వీలైతే ఈ-కేవైసీని కూడా పూర్తి చేసుకోవడం మంచిది. ఆలస్యం చేస్తే తమకు రావాల్సిన సరుకును కోల్పోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.