Crime News: కుటుంబ పోషణ భారమై.. కన్న కూతురిని కడతేర్చిన కసాయి తండ్రి..!

Crime News:ఈ కరోనా కారణంగా చాలా మంది ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. కుటుంబాన్ని పోషించే స్థోమత లేక కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొంతమంది మాత్రం కుటుంబ సభ్యులను కడతేర్చటానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల రంగారెడ్డి జిల్లాలో ఇటువంటి దయనీయమైన సంఘటన చోటు చేసుకుంది. కూతురు ని పోషించే స్తోమత లేక కన్నా తండ్రి ఆ పసికందు ప్రాణం తీశాడు.

వివరాల్లోకి వెళితే…రంగారెడ్ది జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండల పరిధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులకు అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పోషించే స్తోమత లేక కన్నతండ్రి ఆ చిన్నారి పట్ల కసాయివాడు ప్రవర్తించి గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. బాపన్ కుంట తండాకు చెందిన నరేష్, రజిత గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు 19 నెలల వయసున్న చిన్నారి ఉంది.

కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ క్రమంలో తన కడుపున పుట్టిన కూతురిని పెంచి పోషించలేని భావించిన నరేష్ అభం శుభం తెలియని చిన్నారి పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించాడు. కూతురి ఆలనా పాలనా చేసుకోలేక చిన్నారి ప్రాణాలు తీయడమే మార్గమని భావించి చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel