Crime news: సలసలా మరుగుతున్న నీళ్లను.. మరిది మర్మాంగంపై పోసేసేసింది!

Crime news: బిహార్ రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. తల్లితా మరిది చూడాల్సిన ఓ వదిన.. సలసలా మరుగుతున్న నీటిని తీస్కెళ్లి అతని మర్మాంగంపై పోసేసింది. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. వదినను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పాట్నాలోని మక్సూద్ పూర్ ప్రాంతంలో మిథిలేష్ కుమార్ అనే యువకుడు తన భార్య శోభా దేవితో కలిసి నివాసం ఉంటున్నాడు. మిథిలేష్ కుమార్ అన్న రాజ్ కుమార్, వదిన స్వప్నా దేవి కూడా పక్క పోర్షషన్ లోనే ఉంటున్నారు. అయితే గతంలో అన్నాతమ్ముల్లు, తోడి కోడళ్లు అంతా కలిసే ఉండేవారు.

కానీ ఆస్తి విషయంలో గొడవలు రావడంతో.. వేరయ్యారు. అన్నాదమ్ములు ఇద్దరూ వేరు కాపురాలు పెట్టి ఎవరి జీవితాన్ని వారు గడుపుతున్నారు. అయితే తాజాగా మళ్లీ ఆస్తి విషయంలోనే గొడవ జరిగింది. దీంతో అన్న భార్య స్వప్నా దేవి… సలసలా మరుగుతున్న నీటిని తీస్కెళ్లి.. మరిది మర్మాంగాలపై పోసింది. దీంతో మంటను తట్టుకోలేకపోయిన మిథిలేష్ కేకలు వేస్తూ… బయటకు పరుగులు తీశాడు. విషయం గుర్తించిన ఆయన భార్య వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించింది. అలాగే తోడి కోడలు స్వప్నాదేవిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel