చిన్నచిన్న కారణాలతో ప్రజలు ఆత్మహత్య వరకూ వెళ్లిపోతున్నారు. వాళ్లు అడిగింది చేయకపోతే భార్యలు ఏ పురుగుల మందు డబ్బానో లేదా చీరతో ఉరివేసుకోవడమో చూస్తూనే ఉన్నాం..కాకుపోతే కాపురానికి రాననిందని ఒకరు భార్య తిరునాళ్లకు రానన్నదని మరొకతను సూసైడ్ చేసుకుంటే.. ఇప్పుడు మరొకతను మరీ విచత్రంగా కట్టకున్న పెళ్లాం టీ పెట్టను అనిందనే కోపంతో సూసైడ్ చేసుకోబోయాడంట.. మరి అదెక్కడో చూసేయ్యండి.
తూర్పుగోదావరి జిల్లా సీతాగనరం మండలం ముగ్గళ్లకు చెందిన మద్దా రామకృష్ణ అనే 23 సంవత్సరాల వ్యక్తి.. తన భార్య ఆశాజ్యోతిని టీ పెట్టమని అడిగాడట. దానికి భార్య ఇంట్లో సరుకులు లేవు అని సమాధానం చెప్పిందట దానితో తాను టీ పెట్టమని అడిగితే.. ఇంట్లో సరుకులు లేవు చేప్తుందా అంటూ రామకృష్ణకు కోపం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు.
కోపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన రామకృష్ణ సాయంత్రమైనా ఇంటికి రాలేదు. ఏంటా ఇంకా రాలేదు అని ఎదురుచూస్తుంటే… పురుగుమందు డబ్బా తీసుకుని రామకృష్ణ సాయంత్రం వేళ రాపాక తూము వద్దకు వెళ్లి.. ఆ పురుగుమందు తాగుతూ ఓ సెల్ఫీ వీడియో తీసి ఆ వీడియోను కుటుంబ సభ్యులు, స్నేహితులకు సెండ్ చేశాడు. దానితో ఆ వీడియో చూసిన రామకృష్ణ స్నేహితులు వెంటనే పొలం వద్దకు వెళ్లి అక్కడే పడి ఉన్న రామకృష్ణను తీసుకుని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.