Intinti Gruhalakshmi: ఇంటికి తిరిగి వచ్చిన అనసూయ దంపతులు.. ఎమోషనల్ అయిన తులసి..?

Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

అనసూయ, పరంధామయ్య లు వృద్ధాశ్రమంలో అన్నం తింటూ జ్ఞాపకాలను గుర్తు చేసుకునే బాధపడుతూ ఉంటారు. అప్పుడు పరంధామయ్య ఇంట్లో లాగా కాకుండా ఇక్కడ కడుపు నింపుకోవడానికి రెండు ముద్దలైన తినాల్సిందే అని అంటాడు. మరొకవైపు ప్రేమ్ అనసూయ దంపతుల కోసం వెతుకుతూ ఉండగా ఇంతలో ప్రేమ్ స్నేహితుడు ఫోన్ చేసి మీ నానమ్మ తాతయ్య ఆచూకీ తెలిసింది.

Advertisement

వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్నారు అని చెప్పగానే వెంటనే ప్రేమ్ ఆనందంలో తన తల్లికి ఫోన్ చేయబోతాడు. అప్పుడు శృతి తులసి ఆంటీకి వద్దు మాధవి ఆంటీ కి ఫోన్ చెయ్ అని చెబుతుంది. ఇక వెంటనే ప్రేమ్ మాధవికి ఫోన్ చేసి చెప్పడంతో మాధవి సంతోషించి తులసి ని తీసుకొని ఆశ్రమానికి వెళుతుంది.

ఆశ్రమంలో అనసూయ దంపతులు తులసి తలచుకుంటూ తులసీ అయితే మనల్ని పువ్వుల్లో చూసి పెట్టుకునేది అంటూ బాధ పడుతూ ఉండగా, వారిని చూసిన తులసి కన్నీరు పెట్టుకుంటుంది. ఆ తరువాత తులసి పరంధామయ్య కాళ్లు పట్టుకుని నన్ను క్షమించండి మామయ్యా అని అడుగుతుంది.

ఆ తర్వాత పరంధామయ్య వాళ్ళు మాకు ఆశ్రమంలో బాగానే ఉంది అని అనడంతో అప్పుడు తులసి మీరు ఇంటికి రాకపోతే నేను మీకోసం మీ ఆశ్రమం ముందు దీక్ష చేయడానికైనా సిద్ధం అని చెప్పడంతో అనసూయ దంపతులు తప్పక ఇంటికి వెళ్తారు. ఇదంతా కొంచెం దూరం నుంచి చూస్తున్న ప్రేమ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు.

Advertisement

ఇక ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు చూసి నందు ఎంతో సంతోషిస్తాడు. ఇక మీరు నాతో వచ్చేయండి అని అనడంతో వెంటనే తులసి, అత్త మావయ్య లు ఎక్కడికి రారు, నా తోనే ఉంటారు అని అంటుంది. అప్పుడు నందు కోపంతో అందుకే నేను నిన్ను వదిలేశాను అని అనడంతో, ఆ మాటకు సీరియస్ అయిన తులసి నువ్వు పరాయి ఆడదాని తో తిరుగుతుంటే నీ పద్ధతి నచ్చక నేనే వదిలేశాను అని అంటుంది.

ఆ తర్వాత తులసి ఎమోషనల్ తో భర్తగా మీరు పెద్ద ఫెయిల్యూర్ అని నందుని అనడంతో, అప్పుడు నందు భర్త లేకపోతే సమాజంపై ఎటువంటి విలువలు ఇస్తుందో నేను ఇల్లు దాటి వెళ్లిపోయిన తర్వాత తెలుస్తుంది అంటూ లాస్యను తీసుకుని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel