Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Janaki Kalaganaledu: అందరి ముందు బయటపడిన మల్లిక నిజ స్వరూపం.. జానకిని క్షమించమని కోరిన జ్ఞానాంబ..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరి

By Ramesh Babu

Published on: August 9, 2022 11:05 AM

Updated on: August 9, 2022 11:05 AM

---Advertisement---

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్ఞానాంబ, జానకి పై గట్టిగా అరుస్తుంది.

ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ,జానకి అని గట్టిగా అరవడంతో ఇంతలో జానకి అక్కడికి వస్తుంది. అప్పుడు జానకి చేతిలో ఉన్న పుస్తకాన్ని చూసి ఈ పుస్తకం ఎవరిది అనే జానకి నిలదీయగా నాది అని చెబుతుంది. అప్పుడు జ్ఞానాంబ తోరాలు పడేసి పుస్తకాలను లోపల పెట్టింది అనడంతో అందరూ షాక్ అవుతారు.

Advertisement

Rama Chandra gets worried about Jnanambas conditions in todays janaki kalaganaledu serial episode

అప్పుడు జానకి లేదు అత్తయ్య నేను పెట్టలేదు అని చెబుతుంది. ఇంతలోనే మల్లికా అవకాశం చిక్కింది కదా అని జానకిపై లేనిపోని చాడీలు చెబుతుంది. చదువు విషయంలో సాంప్రదాయాన్ని పక్కన పెట్టావు రేపు భర్తను పక్కన పెట్టావా అంటూ జానకిని నానా మాటలు అని బాధ పెడుతుంది జ్ఞానాంబ. అప్పుడు జానకి తాను ఆ పుస్తకాలు అక్కడ పెట్టలేదు అని ఎంత చెప్పినా కూడా జ్ఞానాంబ.

అప్పుడు మల్లికా మీరు పెట్టిన షరతులలో జానకి ఒక తప్పు చేసింది వెళ్లి అందులో ఒక సంఖ్యను చెరిపేస్తాను అని అంటుంది. వెంటనే మల్లికార్జున పీయడానికి వెళుతూ ఉండగా జానకి, మల్లిక చేతులకు ఉన్న పసుపును గమనిస్తుంది. అప్పుడు జానకి మళ్ళీ కని పిలిచి తన గదిలో ఉన్న నెక్లెస్ ఎక్కడ పెట్టావు అని అడుగుతుంది. అప్పుడు జానకి మాటలకు మల్లిక ఒకసారిగా షాక్ అవుతుంది.

అప్పుడు మల్లికా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు జానకి నా నెక్లెస్ కు పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి అక్కడ పెట్టాను అని అంటుంది. మల్లికా నేను తీయలేదు అని అనడంతో అది ఇవ్వకుంటే పోలీస్ కేసు పెడతాను అని అంటుంది జానకి. అప్పుడు మల్లిక మాత్రం తీయలేదు అని బుకాయిస్తుంది.

Advertisement

దీంతో వెంటనే జానకి నువ్వు ఆ నెక్లెస్ తీయనప్పుడు నీ చేతికి పసుపు ఎక్కడిది అనడంతో బుక్ తీసి లోపల పెట్టేటప్పుడు పసుపు అయ్యింది అని మల్లిక నోరు జారుతుంది. అప్పుడు ఆ తప్పు చేసింది మల్లికానే అని తెలుసుకొని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు మల్లిక తప్పు తెలుసుకుని జ్ఞానాంబ కాళ్లపై పడి క్షమించమని అడుగుతుంది.

అప్పుడు మల్లికను చెడమడ ఇట్టి జానకిని క్షమించమని కోరి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత మల్లికా బట్టల షాప్ దగ్గరికి వెళ్లి విష్ణువుతో విడాకులు ఇవ్వమని కాసేపు మాటల యుద్ధం చేస్తుంది. మరొకవైపు రామచంద్ర తన తల్లి జానకి కి పెట్టిన షరతులను తలుచుకుంటూ ఏదో పరధ్యానంతో స్వీట్ షాప్ దగ్గరికి వచ్చిన వ్యక్తికి డబ్బులు ఎక్కువగా ఇస్తాడు.

వెంటనే అతను డబ్బులు ఎక్కువగా ఇస్తున్నావ్ రామచంద్ర అని అనగా వెంటనే తేరుకుంటాడు. ఇంతలోనే జానకి అక్కడికి వచ్చి రామచంద్ర తో సరదాగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.