Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Mohammed Siraj : ఇంగ్లాండ్‌తో ఐదో టెస్ట్.. సిరాజ్ చేసిన తప్పు ఇదే.. టీమిండియాకు భారీ మూల్యం.. ఆ ఓవర్‌లో ఏం జరిగిందంటే?

Mohammed Siraj : మహమ్మద్ సిరాజ్ బౌండరీ పొరపాటు హ్యారీ బ్రూక్‌కు సిక్స్ ఇచ్చింది. ఫలితంగా ప్రసిద్ధ్ కృష్ణకు సిరాజ్ క్షమాపణలు చెప్పాడు. కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు.

By Vinod Kumar

Published on: August 3, 2025 9:04 PM

Updated on: August 3, 2025 9:05 PM

Mohammed Siraj

---Advertisement---

Mohammed Siraj : ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లండన్‌లో ది ఓవల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య చివరి మ్యాచ్ జరుగుతోంది. భారత జట్టు(Mohammed Siraj)  ఇంగ్లాండ్‌కు 374 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లాస్ట్ మ్యాచ్‌లో 4వ రోజు ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 301 పరుగులు చేసింది.

మ్యాచ్‌లో నాల్గవ రోజు (ENG vs IND 5th Test)  మొహమ్మద్ సిరాజ్ హ్యారీ బ్రూక్‌కు కొత్త ఉత్సాహాన్నిచ్చాడు. ఆ సమయంలో హ్యారీ బ్రూక్ (Harry Brook) 21 బంతుల్లో 19 పరుగులు చేసి ఆడుతున్నాడు. హ్యారీ బ్రూక్ జో రూట్‌తో అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు.

Advertisement

క్యాట్ అవుట్ అయిన తర్వాత హ్యారీ బ్రూక్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. హ్యారీ బ్రూక్ 111 పరుగులు చేసి ఔటయ్యాడు. హ్యారీ బ్రూక్ క్యాచ్ మిస్ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ కూడా షాక్ అయ్యాడు. అనంతరం అతని స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Mohammed Siraj : అసలు ఆ ఓవర్‌లో ఏం జరిగింది? :

ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 35వ ఓవర్ తొలి బంతికి హ్యారీ బ్రూక్ ప్రసిద్ధ్ కృష్ణ బంతిని బిగ్ షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ, ఆ బంతి నేరుగా బౌండరీ దగ్గర మొహమ్మద్ సిరాజ్ చేతుల్లోకి వెళ్లింది.

Read Also : Aadhaar Face Authentication : ఇకపై OTP, ఫింగర్‌ఫ్రింట్స్ అక్కర్లేదు.. పోస్టాఫీసుల్లో ఆధార్ ఫేస్ అథెంటికేషన్.. మీ ముఖం చూపించి డబ్బులు తీసుకోవచ్చు!

భారత జట్టులోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన మొహమ్మద్ సిరాజ్ హ్యారీ బ్రూక్ క్యాచ్‌ను అద్భుతంగా పట్టుకున్నాడు. కానీ, క్యాచ్ తర్వాత అతను తన బ్యాలెన్స్‌ చేయలేకపోయాడు. తన చేతిలో ఉన్న బంతిని బౌండరీకి ఢీకొట్టాడు. ఫలితంగా బ్రూక్ అవుట్ కాకుండా 6 పరుగులు చేశాడు.

Advertisement

మ్యాచ్ ఎలా ఉందంటే? :
భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదో చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. చివరి టెస్ట్‌లో భారత్‌పై గెలవాలంటే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 374 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్లు క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, హ్యారీ బ్రూక్ వికెట్లు కోల్పోయిన తర్వాత ఇంగ్లాండ్ ఇప్పటివరకు 58 ఓవర్లలో 301 పరుగులు చేసింది.

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.