Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Weather Report : భగభగమంటున్న భానుడు.. గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కడంటే?

Weather Report : రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తోంది. నిజామాబాద్​

By Vinod Kumar

Published on: April 19, 2022 10:01 PM

Updated on: April 19, 2022 10:52 PM

Weather Report

---Advertisement---

Weather Report : రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టు అనిపిస్తోంది. నిజామాబాద్​ జిల్లా లక్ష్మపూర్​లో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్​ నార్త్​, ఆదిలాబాద్​ భోరాజ్​లో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మెట్​పల్లి, ఆలిపూర్​, ఆదిలాబాద్​ జిల్లా చాపర్లలో ​ 44.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

Temperature in Telangana
Weather Report Temperature in Telangana

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, కుమురం భీం ఆసిఫాబాద్ లో కౌతాలా, నిజామాబాద్ జిల్లాలోని పల్దాలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో, జగిత్యాల్ జిల్లా వెల్గటూర్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 44.2 డిగ్రీల సెల్సియయస్ ఉఫ్ణోగ్రతలు రికార్డయ్యాయి. అలాగే పెద్దపల్లి జిల్లా అక్కెనపల్లి, ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం వేల కూడా బయటకు రాలేక నానా అవస్థలు పడుతున్నారు. ఎండ వేడిమిని తట్టుకోలేక జ్యూస్ లు, కొబ్బరి బోండాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు.

Advertisement

Read Also : 

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.