Gold prices today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం 480 రూపాయలు పెరిగి రూ.55,250 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధర కూడా రూ.972 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.71,972గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ.54,770 గా ఉంది. కిలో వెండి ధర రూ.71,100 వద్ద కొనసాగుతోంది. విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.55,250 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.71,972గా ఉంది. వైజాగ్ లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.55,250 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,972 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో పది గ్రాముల పసిడి ధర రూ.55,250 గా ఉంది. కేజీ వెండి ధర రూ.71,972 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగానూ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఔన్సు బంగారం 1,985 డాలర్లు పలుకుతోంది. మరోవైపు స్పాట్ వెండి ధర ఔన్సుకు 25.70 డాలర్లుగా ఉంది.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel