Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Crime News : అర్ధరాత్రి ఎక్సర్ సైజ్ చేయొద్దన్నందుకు… కన్న తల్లిని కడతేర్చిన కొడుకు !

Crime News : కొడుకు మరి ఎక్కువగా కష్ట పడటం చూడలేక అర్థరాత్రి పూట వ్యాయమం చేయవద్దని చెప్పడమే ఆ తల్లి చేసిన పాపం అయ్యింది. అందుకు గాను కన్నతల్లినే ఓ కసాయి కొడుకు

By Ramesh Babu

Published on: January 24, 2022 1:25 PM

Updated on: January 25, 2022 12:54 AM

---Advertisement---

Crime News : కొడుకు మరి ఎక్కువగా కష్ట పడటం చూడలేక అర్థరాత్రి పూట వ్యాయమం చేయవద్దని చెప్పడమే ఆ తల్లి చేసిన పాపం అయ్యింది. అందుకు గాను కన్నతల్లినే ఓ కసాయి కొడుకు అత్యంత దారుణంగా చంపేశాడు. హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిదిలో పాపమ్మ కుటుంబం నివాసముంటున్నారు. ఆమె కొడుకు సుధీర్ అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో ఎక్సర్ సైజ్ చేస్తుండగా తల్లి మందలించింది.

దీంతో ఆవేశానికి లోనైన సుధీర్ అత్యంత దారుణంగా ఇనుప రాడ్‌తో తల్లి తలపై బలంగా కొట్టాడు. ఈ హఠాత్తు పరిణామంతో ఖంగుతున్న అతని చెల్లి తల్లిని కాపాడేంధుకు అడ్డుగా రావడంతో ఆమెను కూడా రాడ్ తో కొట్టాడు. ఇద్దరు రక్తపు మడుగులో పడిపోయారు. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు త్వరితగతిన ఘటన స్థలానికి చేరుకున్నారు.

Advertisement

65d2785a 0da4 11ec 9f5a 6ec3df6f49ec 1630776143667

అప్పటికే పాపమ్మ మృతి చెందగా, చెల్లికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన చెల్లిని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన పాపమ్మను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అయితే, పలు గతకొన్ని రోజులుగా సుధీర్ సైకోగా మారి వికృత చేష్టలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సుధీర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also : Hang Over : హ్యాంగోవర్ తగ్గాలంటే ఏం చేయాలో తెలుసా…

Advertisement

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.