Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Fire Accident in Eluru : ఏలూరులో భారీ అగ్ని ప్రమాదం… ఆరుగురు మృతి!

Fire Accident in Eluru : ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరులోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా... 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. జిల

By Vinod Kumar

Published on: April 14, 2022 6:49 AM

Updated on: April 14, 2022 7:13 AM

Fire Accident in Eluru

---Advertisement---

Fire Accident in Eluru : ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరులోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా… 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. జిల్లాలోని మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యూనిట్ 4లో జరిగిన ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఐదుగురు సజీవ దహనం అయ్యారు. ఆసుపత్రికి తరలించే టప్పుడు మరో వ్యక్తి చనిపోయాడు. క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

Fire Accident in Eluru
Fire Accident in Eluru

వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో షిప్టులో 150 మంది పని చేస్తున్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న ఏలూరు ఎస్పీ.. ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోరస్‌ పరిశ్రమలో ఔషధ తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Read Also : 

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.