Guppedantha Manasu June 22 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సాక్షి కి రిషి ఫ్యామిలీ అందరు కలిసి తగిన బుద్ది చెప్తారు.
ఈ రోజు ఎపిసోడ్ లో రిషి కాలేజీలో తన రూమ్ కి వెళ్లి చూడగా అక్కడ ఒక లెటర్ అందులో ఒక పెన్ డ్రైవ్ ఉండడంతో దాని ని ఓపెన్ చేసి చూడగా అందులో సాక్షి మాట్లాడిన ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో సాక్షి మాట్లాడుతూ వసు కి ప్రపోజ్ చేశావ్ తన రిజెక్ట్ చేసినా కూడా ఎందుకు తన కోసం అంతలా తపనపడుతున్నావు నా ప్రేమ అర్థం చేసుకో అని మాట్లాడుతూ ఉండగానే వెంటనే వీడియో క్లోజ్ చేస్తాడు.
Guppedantha Manasu June 22 Today Episode ఆ తర్వాత అటెండర్ కి చెప్పి వసుధార ని పిలిపించి వసు పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతాడు. వసు అక్కడికి రాగానే ఎందుకు నువ్వు సాక్షితో అన్ని విషయాలు చెప్పావు అంటూ వసు కి మాట్లాడే అవకాశం లేకుండా వసు ని చెడా మడా తిడతాడు. ఆ తర్వాత వసు అక్కడి నుంచి వెళ్లి పోతుంది. రిషి అన్న మాటలు తలుచుకొని బాధ పడుతూ ఉండగా ఇంతలో జగతి అక్కడికి వచ్చి ఏమయింది వసు ఎందుకు అలా ఉన్నావు అని అనడంతో రిషి జెంటిల్మెన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత వసు కి మహేంద్ర ఎదురుపడి ఏమయింది వసు అని అడిగిన కూడా ఏం సమాధానం చెప్పకుండా మౌనంగా వెళ్ళి పోతుంది. అప్పుడు మహేంద్ర జగతి దగ్గరికి వెళ్లి ఎందుకు వసుధార అలా ఉంది అని అడగగా ఏమో మహేంద్ర నాకు కూడా ఏం చెప్పలేదు అని అంటుంది జగతి. మరొకవైపు సాక్షి, దేవయాని దగ్గరికి వెళ్లి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆంటీ అని అనగా అప్పుడు దేవయాని సాక్షి కి ధైర్యం చెప్పి రిషిని దక్కించుకోవాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అని ధైర్యం చెబుతుంది.
ఆ తర్వాత వసు ఒంటరిగా కూర్చొని గోలీల సీసాను చూస్తూ ఉంటుంది. మరొకవైపు రిషి కూడా గోలీల సీసాను చూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి జగతి వస్తుంది. అప్పుడు రిషి చేతిలో ఉన్న ఆ గోలీల సీసా పడిపోతు ఉండగా అప్పుడు జగతి ఒకసారి వస్తువు చేజారి పోతే మళ్ళీ దాన్ని పొందలేము అని చెప్పి ప్రాజెక్ట్ గురించి మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత రిషి మల్లి కూలీల సీసా వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు.
Read Also : Guppedantha Manasu: సాక్షికి గట్టిగా బుద్ధి చెప్పిన వసు.. వసుపై కోపంతో రగిలిపోతున్న రిషి..?