YS Jagan Mohan Reddy : వైయస్సార్సీపి ప్లీనరీ ముగింపు వేడుకలు చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్… చిప్ ఉండాల్సింది మెదడులో అంటూ కామెంట్!

YS Jagan Mohan Reddy : వైయస్సార్సీపి ప్లీనరీ ముగింపు వేడుకలో భాగంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ తనపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తాను ఇచ్చిన హామీలను 95% అమలు చేశామని వెల్లడించారు.అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోనే వాలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చామని అలాగే లక్షకు పైగా ఉద్యోగ ప్రకటన చేస్తూ గ్రామ సచివాలయాలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల వాకిట్లోకి ప్రభుత్వ సేవలను అమలు పరచామని ముఖ్యమంత్రి వెల్లడించారు.గతంలో చెప్పిన విధంగానే తాను ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అదే ధైర్యంతోనే వచ్చే ఎన్నికలలో ఓట్లు అడగడానికి వెళ్తున్నామని తెలిపారు.

YS Jagan Mohan Reddy

చంద్రబాబు నాయుడు మాదిరిగా తాను గత మూడు సంవత్సరాల నుంచి ప్రతిపక్ష పార్టీ గురించి ఆలోచించలేదని ప్రజలకు ఏం చేస్తే మంచి కలుగుతుంది ప్రజలను అభివృద్ధి దిశగా ఎలా నడిపించాలని ఆలోచన చేశామని తెలిపారు.ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమైన తన ప్రయాణం 151 ఎమ్మెల్యేల వరకు చేరిందని చంద్రబాబు నాయుడు మాదిరిగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను లాక్కోవడానికి తాను ఎప్పుడు ప్రయత్నం చేయలేదని జగన్ పేర్కొన్నారు.ఇకపోతే 14 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు తన కుప్పం నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని మన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు అనే విషయాన్ని గుర్తు చేశారు.

Advertisement

YS Jagan Mohan Reddy : చంద్రబాబును టార్గెట్ చేసిన జగన్… చిప్ ఉండాల్సింది మెదడులో అంటూ కామెంట్…

కుప్పం ప్రజల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వమే ఆ నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ గా చేసిందని జగన్ గుర్తు చేశారు.ఇక జగన్ మాట్లాడుతూ ఒక మనిషికైనా రాజకీయ పార్టీ కైనా రెండు గుణాలు ముఖ్యం ఒకటి క్యారెక్టర్ రెండవది క్రెడిబిలిటీ. ఈ రెండు ఏ మనిషినైనా ఏ పార్టీనైనా ధైర్యంగా ముందుకు నడిపిస్తాయని జగన్ పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తెలుసుకొని ఆ కష్టాల గురించి ఆలోచించే చిప్ గుండెలో ఉండాలని చెప్పారు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఓ చిప్ చూపించారు. చిప్ ఉండాల్సింది వేళ్ళకు కాళ్లకు కాదు చిప్ ఉండాల్సింది బ్రెయిన్ లోను, గుండెలోను ఉండాలని జగన్ సూచించారు. ఆయనకు కేవలం పదవి వ్యామోహం తప్ప ప్రజలపై ప్రేమ లేదని ఈ సందర్భంగా ప్లీనరీ ముగింపు వేడుకలో జగన్ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Read Also :  YS Vijayamma : వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవికి రాజీనామా చేసిన వైయస్ విజయమ్మ.. వచ్చే ఎన్నికలలో కూడా జగనే ముఖ్యమంత్రి!

Advertisement
admin

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Recent Posts

Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్‌ఫుల్ టిప్స్ మీకోసం.. !

Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…

1 month ago

Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…

1 month ago

Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు

Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…

1 month ago

CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?

CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…

1 month ago

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…

1 month ago

Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!

Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…

1 month ago

This website uses cookies.