Telangana: తెలంగాణలో కొన్నాళ్లుగా రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఈ మధ్యే బీజేపీ పార్టీ అగ్ర నాయకత్వం హైదరాబాద్ కు వచ్చి రెండ్రోజుల పాటు సమావేశాలు నిర్వహించి… చెప్పకనే చెప్పినట్లు ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా హేమా హేమీలంతా తెలంగాణకు వచ్చారు.
హైదరాబాద్ లో పార్టీ కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్లంతా రాష్ట్రమంతా చుట్టి వచ్చారు. రాష్ట్రంలోని నాయకులను, పార్టీ కేడర్ ను కలిసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. బీజేపీతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా బీజేపీకి ధీటుగానే బదులిచ్చింది. కమలం పార్టీ నేతలు మాట్లాడిన మాటలకు, చేసిన విమర్శలకు అంతే పదునుగా సమాధానం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఎక్కడా తక్కువ కాదు అన్న ధోరణిలో ఇరు పార్టీలపై విమర్శలు గుప్పించారు హస్తం నాయకులు.
అయితే రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనేది నిజంగా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది. ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ మస్తాన్ దీనిపై కామెంట్స్ చేశాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అధికార పార్టీ టీఆర్ఎస్ కే ఎక్కువ ఓట్లు సీట్లు వస్తాయని చెప్పాడు. టీఆర్ఎస్ కు 38.88 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించాడు. అలాగే బీజేపీకి 30.48 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. కాంగ్రెస్ కు 23.71 శాతం వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇతరులకు 6.93 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని మస్తాన్ పేర్కొన్నారు.
Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…
Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…
Realme 13 Pro Price : రియల్మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…
CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…
Airtel IPTV Plans : ఎయిర్టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…
Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…
This website uses cookies.