వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

YS Jagan Reddy : రాబోయే ఎన్నికల కోసం వ్యూహం మారుస్తున్న వైసీపీ.. ఆ పనులు చేసేందుకు ప్లాన్!

YS Jagan Reddy : ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారి అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం దానిని ఎలాగైనా నిలుపుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ పార్టీ అధికారం చేపట్టి దాదాపు రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి.అధికారం చేపట్టినప్పటి నుంచి కేవలం నవరత్నాలు అనే పథకాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేనే లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రాజెక్టులు, రోడ్లు మొదలగు వాటిని చూపిస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. ఈ టైంలో సర్కారు డిఫరెంట్‌గా ... Read more

By Vinod Kumar

Published on: November 18, 2021 1:13 PM

Updated on: November 18, 2021 1:21 PM

Ysrcp planning to change strategy by Next AP elections 

---Advertisement---

YS Jagan Reddy : ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారి అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం దానిని ఎలాగైనా నిలుపుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఈ పార్టీ అధికారం చేపట్టి దాదాపు రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయి.అధికారం చేపట్టినప్పటి నుంచి కేవలం నవరత్నాలు అనే పథకాలపైనే ఎక్కువగా దృష్టి సారించింది. కానీ రాష్ట్రంలో అభివృద్ధి లేనే లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రాజెక్టులు, రోడ్లు మొదలగు వాటిని చూపిస్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నాయి. ఈ టైంలో సర్కారు డిఫరెంట్‌గా ఆలోచిస్తూ ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నట్టు టాక్.

ఇప్పటి వరకు ప్రభుత్వం చేసింది ఒకెత్తు. ఇక నుంచి అనుసరించబోయే విధానం మరొక ఎత్తు అని వైసీపీ సీనియర్స్ చెబుతున్నారు. దీంతో పార్టీలో ప్రస్తుతం ఈ విషయంపైనే చర్చలు నడుస్తున్నాయి. ఇక ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి పెద్ద పీట వేయనుందని టాక్. దానితో పాటు మూడు రాజధానుల అంశాన్ని సైతం బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ట్రై చేయబోతోందట.సామాజిక వర్గాల వారీగా సమస్యలను పరిష్కరించడం, రాష్ట్రానికి పెట్టబడులను ఆకర్షించడం వంటి వాటిపై ఫోకస్ చేయనుందని టాక్.

ఇప్పటి వరకు కాస్త నెమ్మదిగా కొనసాగిన పోలవరం ప్రాజెక్టుపై ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టనుందని తెలుస్తున్నది. దీనితో పాటు కడప ఉక్క ఫ్యాక్టరీని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టబోతున్నదని ఆ పార్టీకి చెందిన పలువురు చెబుతున్నారు. ఇక వీలైనంత వరకు విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తూ.. ఆయా కంపెనీలు ప్రోత్సహించాలని చూస్తోంది. ఇక ఉద్యోగాలు కల్పించే విషయంలోనూ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తూ.. రాబోయే రెండున్నరేండ్లలో కొత్త కొత్త విధానాలు అనుసరిస్తూ పార్టీపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నదని సీనియర్లు చెబుతున్నారు.

Read Also : Amit Shah : నిజంగానే బీజేపీకి ఏపీలో అంత సత్తా ఉందా? అమిత్ షా వ్యూహం ఫలిస్తుందా..?

, , , , , , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel