Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Two girls married: పెళ్లి చేసుకున్న ఇద్దరు అమ్మాయిలు.. నెక్స్ట్ ఏం జరిగిందటే?

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఓ యువతి తల్లి.. మరో అమ్మాయి తన కూతురిని అక్రమంగా నిర్బంధించిందంటూ

By Vinod Kumar

Published on: April 14, 2022 3:28 PM

Updated on: April 14, 2022 3:28 PM

---Advertisement---

ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఇద్దరు అమ్మాయిలు పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన ఓ యువతి తల్లి.. మరో అమ్మాయి తన కూతురిని అక్రమంగా నిర్బంధించిందంటూ కోర్టును ఆశ్రయించింది. యువతి తల్లి అంజు దేవీ హైకోర్టులో కోర్టులో హెబియస్ కార్పస్​ పిటిషన్ వేసింది. దీంతో కోర్టు ఆ ఇద్దరినీ న్యాయస్థానం ఎదుట ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏప్రిల్​ 6న ఆదేశించింది. మరుసటి రోజే కోర్టు ముందుకు వచ్చిన ఇరువురు యువతులు ‘మేము వివాహం చేసుకున్నాం. దానిని అంగీకరించాలి’ అని కోర్టును అభ్యర్థించారు.

two girls married in up
అయితే యువతి తల్లి తరఫున వాదించేందుకు వచ్చిన లాయర్… స్వలింగ సంపర్కుల వివాహానికి అడ్డు చెప్పనని, కేసు వాదించట్లేదంటూ చేతులెత్తేశారు. అలాగే ‘పవిత్ర భారత దేశంలో వివాహాన్ని సంస్కారంగా భావిస్తారు. పురుషుడు, స్త్రీ మధ్యే పెళ్లి జరగాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదించారు. దీంతో.. హైకోర్టు ఆ మహిళల పిటిషన్ ​ను విచారించలేమంటూ తిరస్కరించింది. యువతి తల్లి వేసిన హెబియస్​ కార్పస్​ వ్యాజ్యాన్ని సైతం కొట్టేసింది.

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :