Jana Reddy Sons : ప్రత్యక్ష రాజకీయాల్లో జానారెడ్డి కుమారుల ఎంట్రి..? ఎక్కడి నుంచి పోటీ చేస్తారంటే..?

Updated on: November 30, 2021

Jana Reddy Sons : తెలుగు రాష్ట్రాల్లో జానారెడ్డి పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా ఆయన పేరు సంపాదించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీతో పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిన జానారెడ్డి.. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న టైంలో ట్రాన్స్ పోర్ట్ మినిష్టర్ గా సేవలందించారు. కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ లో చేరిన ఆయన.. వైఎస్సార్ సీఎంగా ఉన్న టైంలో పలు మంత్రి పదవులు దక్కించుకున్నారు. హోం మినిస్టర్ గా సైతం సేవలందించారు. అప్పట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన జానారెడ్డి స్పీడ్ ప్రస్తుతం తగ్గిందనే చెప్పాలి. 2018లో అసెంబ్లీ ఎన్నికల టైంలో నాగార్జున‌సాగర్ నుంచి పోటీచేసిన ఆయన ఓడిపోయారు. వాస్తవానికి ఆ నియోజకవర్గం ఆయనకు కంచుకోట. కానీ అక్కడ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నోమలు నర్సింహయ్య గెలుపొందారు.

అనంతరం నర్సింహయ్య చనిపోయాక ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానంతో గొడవపడి మరీ టికెట్ దక్కించుకున్నాడు జానారెడ్డి. కానీ టీఆర్ఎస్ తరపున నర్సింహయ్య కుమారుడు భగత్ పోటీచేసి జానారెడ్డిపై విజయం సాధించాడు. అయితే ప్రత్యక్ష రాజకీయాలను ఇక తానుదూరంగా ఉంటానని జానా ప్రకటించారని టాక్. అయితే ఇక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించేందుకు తన కుమారులను సిద్ధం చేసుకుంటున్నాడు.

Rohini Bazaar Deoghar
Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

రెండో కుమారుడు జైవీర్ ఇప్పటికే నాగార్జున సాగర్ శాసనసభ నియోజకవర్గంలో పర్యటనలు స్టార్ట్ చేశారు. లీడర్లందరికీ టచ్ లో ఉంటున్నారు. పెద్ద కుమారుడు రఘువీర్ మిర్యాలగూడ నియోజకవర్గంపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లోనే మిర్యాలగూడ నుంచి రఘువీర్ కు టికెట్ దక్కాల్సింది. కానీ ఒక ఫ్యామిలీకి ఒకే టికెట్ అంటూ రాహుల్ గాంధీ చెప్పడంతో ఆయనకు పోటీ చేసే చాన్స్ రాలేదు. అయితే ఈ రెండు నియోజకవర్గాలపై జానాకు మంచి పట్టుంది. ఫాలోయింగ్ సైతం ఎక్కువే. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారులకు టికెట్ వస్తే గెలిచేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Read Also : JR NTR : టీడీపీ స్కెచ్ అదేనా? అందుకే జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్స్ చేశారా? 

IND vs SA 1st T20I Hardik Pandya Enters Elite T20 Club After Virat Kohli And Rohit Sharma
IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ సబ్ ఎడిటర్‌గా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, స్పోర్ట్స్, హెల్త్, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, మూవీలు, బిజినెస్ వార్తలను రాస్తుంటాను.

Join our WhatsApp Channel