వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Crime News: తమిళనాడులో దారుణం… ప్రియుడిపై దాడి చేసి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం..!

Crime News: ఈ మధ్యకాలంలో పసి పిల్లలు, మహిళలు, ముసలివారు అని తేడా లేకుండా వారి మీద రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టిన కూడా ఇలాంటి నీచుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇటీవల తమిళనాడులో బయటికి వెళ్ళిన ఒక ప్రేమ జంటను కొందరు యువకులు గమనించి ప్రియుడిని దారుణంగా కొట్టి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే…తమిళనాడులోని కడలూరు ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ... Read more

By Ramesh Babu

Published on: March 31, 2022 1:21 PM

Updated on: March 31, 2022 1:21 PM

---Advertisement---

Crime News: ఈ మధ్యకాలంలో పసి పిల్లలు, మహిళలు, ముసలివారు అని తేడా లేకుండా వారి మీద రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టిన కూడా ఇలాంటి నీచుల ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇటీవల తమిళనాడులో బయటికి వెళ్ళిన ఒక ప్రేమ జంటను కొందరు యువకులు గమనించి ప్రియుడిని దారుణంగా కొట్టి ప్రియురాలిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే…తమిళనాడులోని కడలూరు ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి ఆఫీస్ ముగిసిన తర్వాత తను ప్రేమించడానికి చంపడానికి అప్పుడు ఒక భవనం వద్దకు వెళ్లి ఇద్దరు అక్కడ కలుసుకునేవారు. అక్కడే ఉంటున్న కొందరు యువకులు వీరు కలుసుకోవటం చాలాసార్లు గమనించారు.

ఈ క్రమంలో ఎప్పటిలాగే సోమవారం రోజు కూడా యువతి తన బాయ్ ఫ్రెండ్‌ను కలిసేందుకు ఆ భవనానికి వెళ్లింది. ఇది గమనించిన యువకులు పక్కా ప్రణాళిక ప్రకారం వారిని బలవంతంగా వేరే ప్రదేశానికి తీసుకువెళ్లారు. అనంతరం యువతి యువకుడి మీద దాడి చేశారు. ఆ తర్వాత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబుతే చంపేస్తామని యువతిని బెదిరించి తిరిగి ఆమెను తీసుకెళ్లి స్థానిక బస్టాండ్ వద్ద వదిలేశారు.అదే సమయానికి అక్కడికి వచ్చిన పెట్రోలింగ్ పోలీసులు యువతి ఏడ్వడం గమనించి ఏమైందని ప్రశ్నించారు. యువతి పోలీసులకు జరిగిన దారుణం గురించి వివరించింది.పోలీసులు వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించి.. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel