Horoscope : ఈ వారం అనగా ఆగస్టు 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఈ సమస్యలు తప్పవని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కన్య రాశి.. కన్య రాశి వాళ్లకు ఆర్థికంగా బాగుంటుంది. కానీ ఉద్యోగంలో సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ముధ్యంగా ఉద్యోగం, వ్యాపారంలో అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం కనిపిస్తోంది. కాబట్టి సందర్భానికి తగినట్లుగా వ్యవహరించండి. ఏకాగ్రతతో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోండి. నమ్మిన ధర్మమే ముందదుకు నడిపిస్తుంది. వ్యాపారంలో శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో వారి సూచనలతో సమస్య తొలగతుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. శాంతి లభిస్తుది.
మకర రాశి.. మకర రాశి వాళ్లకు అస్సలే బాగాలేదు. ముఖ్య కార్యాలను వెంటనే వాయిదా వేస్కోండి. ప్రతీ అడుగు ఆచి తూచి వేయండి. అపార్థాలకు తావివ్వవద్దు. అభద్రతా భావాన్ని రానివ్వవద్దు. మిత్రుల సూచనలు తీసుకోవాలి. పొరపాటు జరిగితే దాన్ని వాడుకునే వారు ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా పని చేయాలి. ఆర్థికంగా మిశ్రమ కాలం. నవగ్రహ ఆరాధన శ్లోకాలు చదువుకోవాలి.