ఈ రోజుల్లో ప్రేమించుకోవడం చాలా కామన్ అయిపోయింది. నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి కనిపించగానే వెంటనే ప్రేమలో పడిపోతున్నది యూత్. వయస్సుతో సంబంధం లేకుండా ప్రేమలో విహరిస్తున్నారు లవ్ బడ్స్. కానీ పెళ్లి విషయానికి వచ్చే సరికి చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కొందరు తమ క్యాస్ట్ కాదని ఒప్పుకోరు. మరి కొందరు ఇంట్లో వారికి బయపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు బ్రేకప్ అయిపోతారు. మరి కొందరు ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ఇంకొందరు ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటారు. కానీ కొందరు ఒకరిని ఒకరు విడిచి ఉండలేక ప్రాణాలు తీసుకుంటారు. ఇలా చాలా లవ్ స్టోరీలో విషాదంతోనూ ముగుస్తుంటాయి. ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో జరిగింది.
వివరాలిలా.. మెదక్ జిల్లా నాగలగిద్ద మండలం మాయినెళ్లికి చెందిన అనిల్ (25).. సంగారెడ్డి జిల్లాలోని భగత్ సింగ్ కాలనీ కి చెందిన కృష్ణవేణి (28) ఇద్దరూ ఏడాదికిపైగా లవ్ చేసుకుంటున్నారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పారు. వీరిద్దరి సామాజిక వర్గాలు వేరుకావడం, వయస్సులోనే వ్యత్యాసం ఉండటంతో ఇరు కుటుంబాల్లోని పెద్దలు ఒప్పు్కోలేదు దీంతో ఈ నెల 5న వీరిద్దరూ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులను పోలీసులను ఆశ్రయించారు. రాయికోడ్ మండలం సిరూర్ సమీపంలో మంజీరా నది వద్ద ఓ బైక్ ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న పోలీసులు ఎంక్వైరీ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం కృష్ణవేణి, శనివారం అనిల్ డెడ్ బాడీలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వీటిని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి పోలీసులు హాస్పిటల్ కు పంపించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.