Padma Awards 2022 : పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురికి..!

Padma Awards 2022 : జనవరి 26, 2022న రిపబ్లిక్‌ డే (#RepublicDay2022) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అయితే అందులో నలుగురికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. మరో 17 మందికి పద్మ భూషణ్ అవార్డు వరించింది. మరో 107 మందికి పదశ్మీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ 2022 పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది.

దివంగత జనరల్‌ బిపిన్‌రావత్‌తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సాహిత్యవేత్త రాధేశ్యామ్‌ ఖేమ్కా (మరణానంతరం), ప్రభా ఆత్రే (మహారాష్ట్ర) పద్మ విభూషణ్‌ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం బుద్ధదేవ్‌ భట్టాచార్యతోపాటు కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్‌ అవార్డులను కేంద్రం ప్రకటించింది.

Advertisement

Padma Awards 2022 : తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు పద్మ పురస్కారాలు..

భారత్‌ బయోటెక్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లా, సుచిత్ర ఎల్లా (తెలంగాణ)కు పద్మభూషణ్ ప్రకటించింది. సీరమ్‌ సంస్థ సైరస్‌ పూనావాలాకు కూడా పద్మభూషణ్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రపంచ టెక్‌ దిగ్గజాలైన సుందర్‌ పిచాయ్‌, సత్య నాదెళ్లకు కూడా పద్మభూషణ్‌ అవార్డులను కేంద్రం ప్రకటించింది.

Padma Awards 2022, Full List Of Recipients, Padma Vibhushan, Padma Bhushan, and Padma Shri

తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులు దక్కాయి. ఏపీ, తెలంగాణలో ఆరుగురు ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఏపీ నుంచి ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుకు పద్మశ్రీ అవార్డు వరించింది. ఇక సుంకర వెంకట ఆదినారాయణ, గోసవీడు హస్సన్ (మరణానంతరం) షేక్‌హసన్‌ పద్మశ్రీ అవార్డులు వరించాయి. తెలంగాణ నుంచి పద్మజారెడ్డి, దర్శనం మొగిలయ్య ((కళలు), రామ చంద్రయ్య లకు పద్మశ్రీలు దక్కాయి.

Advertisement
Padma Awards 2022, Full List Of Recipients, Padma Vibhushan, Padma Bhushan, and Padma Shri

బెంగాల్‌కు చెందిన విక్టర్ బెనర్జీ, బుద్ధదేవ్ భట్టాచార్య, మహారాష్ట్ర నటరాజన్ చంద్రశేఖరన్, సైరస్ పూనావాలా, రషీద్ ఖాన్, వశిష్ట్ త్రిపాఠి, తెలంగాణలో కృష్ణ ఎల్లా, సుచిత్రా ఎల్లా దంపతులు, రాజస్థాన్‌ నుంచి దేవేంద్ర జజారియా, రాజీవ్ మెహిషి, గుజరాత్ నుంచి స్వామి సచ్చిదానంద్, ఒడిశా నుంచి ప్రతిభా రాయ్, మెక్సికో‌కు చెందిన సంజయ రాజారాం(మరణానంతరం), పంజాబ్‌ నుంచి గుర్మీత్ బావా(మరణానంతరం) ఉన్నారు. పద్మశ్రీ అవార్డుల దక్కించుకున్న ప్రముఖుల్లో ఇండియాకు ఒలంపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా, నటి షాపుకారు జానకి, సోనూ నిగమ్ ఉన్నారు.

Read Also : Lenovo Mobile : 22GB RAMతో లెనోవో న్యూ మొబైల్… ఇదే అత్యంత పవర్ ఫుల్ ఏమో!

Advertisement
Tufan9 Telugu News

Tufan9 Telugu News providing All Categories of Content from all over world

Recent Posts

Top 10 Foods Diabetics : డయాబెటిస్ ఉన్నవారు తినకూడని ఆహార పదార్థాలపై ఫుల్ తెలుగు గైడ్..!

Top 10 Foods Diabetics : చక్కెర, జంక్, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఆహారాలకు దూరంగా ఉండాలి. డయాబెటిక్ ఉన్నవారు…

21 hours ago

Varahi Navaratri 2025 : వారాహి నవరాత్రులు.. ఎవరు చేయాలి.. ఎవరూ చేయకూడదు? తేలికైనా పూజా విధానం..!

Varahi Navaratri 2025 : ఈ వారాహి గుప్తనవరాత్రుల్లో పూజలను ఎవరు చేయాలి? అందరూ చేయొచ్చా? ఎవరూ చేయకూడదు? వారాహి…

1 week ago

Ashada Amavasya 2025 : ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులు భూమిపైకి వస్తారు.. ఈ రోజున కచ్చితంగా ఈ ఒక్క పని చేయండి..

Ashada Amavasya 2025 : జూలై 25 ఆషాఢ మాసంలో అమావాస్య రోజు. ఈ రోజున పూర్వీకుల ఆత్మలు భూమికి…

1 week ago

Ashadha Amavasya : 2025 ఆషాఢ అమావాస్య ఎప్పుడు? ఏ తేదీన వస్తుంది? ప్రాముఖ్యత ఏంటి?

Ashadha Amavasya : ఈ రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. పితృ పూజకు ప్రసిద్ధి చెందింది. ఈ రోజున…

1 week ago

WI vs AUS Test : వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా లైవ్.. టెస్ట్ సిరీస్‌ ఎప్పుడు, ఎక్కడ? భారత్‌లో లైవ్ స్ట్రీమింగ్ ఎలా చూడాలి?

WI vs AUS Test : జూన్ 25న బార్బడోస్‌లో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాకు…

1 week ago

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025 : టీఎస్ EDCET రిజల్ట్స్ 2025 విడుదల అయ్యాయి. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక…

1 week ago

This website uses cookies.