Anchor Anasuya : బుల్లి బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వారానికి రెండు రోజులపాటు ప్రసారమవుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ముందున్న కల లేదనే చెప్పాలి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి నాగబాబు రోజా ఇద్దరు కూడా ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు. అదేవిధంగా జబర్దస్త్ కార్యక్రమం అంటేనే హైపర్ ఆది స్కిట్ తో నవ్వుల సునామి ఏర్పడేది.
Anchor Anasuya
గత కొన్ని వారాల నుంచి హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమంలో కనిపించలేదు. ఇకపోతే ప్రస్తుతం ఉన్న కమెడియన్స్ ఈ కార్యక్రమానికి ప్రధానంగా మారి ఈ కార్యక్రమాన్ని నెట్టుకొస్తున్నారు. ఇక జడ్జీ స్థానంలో రోజా కి బదులుగా ఇంద్రజ కొలువుదీరారు. ఇకపోతే నాగబాబు స్థానంలో కొద్దిరోజులపాటు మనో న్యాయనిర్ణేతగా వ్యవహరించగా, అతని బిజీ షెడ్యూల్ కారణంగా కొన్ని సార్లు అతని స్థానంలో మరికొందరు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంటారు.
ఇకపోతే తాజాగా జరిగిన కార్యక్రమంలో భాగంగా ఓ కమెడియన్ రాజుల కాలం నాటి థీమ్ లో స్కిట్ చేసిన ఓ టీమ్ డీజే టిల్లు పాటతో అద్భుతమైన స్కిట్ చేసి అందర్నీ నవ్వించారు. అరేయ్ మొన్న అనుసూయ మహారాణి దగ్గరకు పువ్వు తీసుకెళ్లి ఇస్తే తను తీసుకోలేదు. చాలా సమయం పాటు ఎదురుచూసిన వర్కవుట్ కాలేదని చెబుతాడు. దీనికి తన టీం మెంబర్ సమాధానం చెబుతూ ఇద్దరిలో ఫువ్వు ఎవరో తెలియక తీసుకొని ఉండరు ప్రభూ.. అంటూ పంచ్ విసరడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు. మొత్తానికి అనసూయకు ఫ్లవర్ ఇవ్వబోయి పెద్ద పుష్పం అయ్యాడు.
Read Also : Sudigali sudheer : సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి డ్యాన్స్ వీడియో వైరల్.. షాక్ లో రష్మి!