Dussehra : నేడే దసరా.. ధనవంతులు కావాలంటే ఈ మూడు వస్తువులను దానం చేయాల్సిందే!

dusshera.jpg,
dusshera.jpg,

Dussehra: ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రజలు దసరా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుపుకునే ఈ దసరా పండుగ హిందూ ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండుగగా భావిస్తారు.దేవి నవరాత్రులను పూర్తి చేసుకున్న అనంతరం పదవ రోజు ఈ దసరా పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి పాండవులు కౌరవులపై విజయదశమి రోజే విజయం సాధించారని అలాగే రావణాసురుడి మరణం కూడా విజయదశమి రోజే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

dusshera.jpg,
dusshera.jpg,

ఇలా అధర్మం పై ధర్మం గెలిచిన రోజున పెద్ద ఎత్తున ఈ విజయదశమి పండుగను జరుపుకుంటారు. ఇక విజయదశమి రోజు ఎంతోమంది ఎన్నో నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏడాది పాటు తమ కుటుంబం సంతోషంతో ఆనందంతో వెళ్లి విరుస్తుందని భావిస్తారు. ఈ క్రమంలోనే ఈ విజయదశమి రోజు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

Advertisement

Dussehra: విజయదశమి .. ధనవంతులు కావాలంటే ఈ మూడు వస్తువులను దానం చేయాల్సిందే!

ఈ క్రమంలోనే విజయదశమి రోజు మనం చేసే దానం ఇతరులకు తెలియకుండా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆమె కరుణ కటాక్షాలు మనపై ఉండటం వల్ల మనం ధనవంతులవుతాము. మరి విజయదశమి రోజు దానం చేయాల్సిన ఆ మూడు వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే.. మనం ఏదైనా ఆలయానికి కొత్త చీపురును దానం చేయడం ఎంతో శుభప్రదం. ఇలా చీపురుని దానం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. అదేవిధంగా ఈ పండుగ రోజు బట్టలు అన్నం నీటిని దానం చేయడం ఎంతో మంచిది.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుందని ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారని పండితులు తెలియజేస్తున్నారు.

Read Also : Shani Dev: శని దేవుని కృపతో ఈ ఐదు రాశుల వారికి అద్భుత ఫలితాలు..?

Advertisement