YS Vijayamma : వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవికి రాజీనామా చేసిన వైయస్ విజయమ్మ.. వచ్చే ఎన్నికలలో కూడా జగనే ముఖ్యమంత్రి!

YS Vijayamma : వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. నేడు వైయస్ జయంతి కావడంతో ఈమె వైఎస్ఆర్సిపి ప్లీనరీ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈమె తీసుకున్న ఈ నిర్ణయాన్ని సభాముఖంగా వెల్లడించారు. ఇకనుంచి తాను వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవి నుంచి తప్పుకుంటున్నానని,ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలను ఉద్దేశిస్తూ ఆమె ఈ విధంగా తన నిర్ణయాన్ని తెలియజేశారు.ఇక ఈ వేదికగా విజయమ్మ మాట్లాడుతూ షర్మిల తెలంగాణ కోడలిగా ఇక్కడ తన అన్నకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా తాను తెలంగాణలో పార్టీ పెట్టి వైయస్సార్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారని విజయమ్మ వెల్లడించారు.

YS Vijayamma
YS Vijayamma

వైయస్ జగన్ షర్మిల ఇద్దరు వైయస్సార్ ఆశయాలను సాధించడానికి పార్టీలు పెట్టారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఇకపోతే గత కొద్దిరోజుల క్రితం వైయస్ విజయమ్మ ప్రమేయం లేకుండా తాను రాయకపోయినా సంతకం చేయకపోయినా రాజీనామా లేకను విడుదల చేయడంపై ఈమె మండిపడ్డారు. ఆలేఖను చూసినప్పుడు ఎంతో బాధగా ఉందని ఈమె పేర్కొన్నారు. జగన్ ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నారంటే దాని వెనుక ఎంతో కష్టం దాగి ఉందని ఈ జగమంత కుటుంబాన్ని వైయస్సార్ తనకు ఇచ్చి వెళ్లారని ప్రజల ఆశయాలతోనే ప్రజలలో నుంచి పుట్టినదే వైయస్సార్సీపీ పార్టీ అంటూ విజయమ్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పొమ్మన లేక పోగపెట్టినట్లు తన బిడ్డపై ఎన్నో కేసులు పెట్టి విచారణ పేరుతో ఆస్తులు జప్తూ చేసినప్పటికీ జగన్ ఏమాత్రం బెదరలేదని విజయమ్మ తెలిపారు

YS Vijayamma : గౌరవ అధ్యక్షత పదవికి వైయస్ విజయమ్మ రాజీనామా..

Advertisement

జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధమైనటువంటి పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని, తాను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి మాత్రమే కాకుండా చెప్పనివి కూడా చేస్తున్నారని ఈ సందర్భంగా విజయమ్మ పేర్కొన్నారు.ఇకపోతే వచ్చే ఎన్నికలలో కూడా జగనే ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా ఈమె ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షత పదవికి తాను రాజీనామా చేస్తున్నందుకు ప్రతి ఒక్క అభిమాని తనను క్షమించాలని,వైయస్ కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ తన ప్రసంగాన్ని ముగిస్తూ తన అధ్యక్షత పదవికి రాజీనామా ప్రకటించారు.

Read Also :  Prakash Raj : మోడీ పర్యటనపై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్.. చూసి నేర్చుకోవాలంటూ కామెంట్స్!

Advertisement

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel