Prabhas: సర్జరీ నుంచి కోలుకున్న ప్రభాస్.. మళ్లీ సెట్ లో వచ్చేది అప్పుడేనట…!

Prabhas: రాధే శ్యామ్ సినిమాతో దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల పైన దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో భారీ వసూళ్లను రాబట్టలేకపోయింది. దీంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనైనట్టు సమాచారం. సినిమా రిలీజ్ అయిన ప్రారంభం నుంచే ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. భారీ స్థాయిలో ప్రమోషన్స్ ను చేసినా ఈ సినిమాకు ప్లస్ కాలేకపోయింది. బాహుబలి తర్వాత మళ్లీ భారీ బడ్జెట్ తో రాధే శ్యామ్ సినిమా వస్తుందని తెలిసి ప్రేక్షకులు ఎంతో సంబరపడ్డారు. కానీ అందులో సగం వంతైనా విజయానికి చేరువ కాలేకపోయిందని టాక్.

దీంతో కాస్త అసంతృప్తికి లోనవుతున్న ఫ్యాన్స్ కు ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాను ప్రకటించి కాస్త ఊరట కలిగించాడు. కేజీఎఫ్ లాంటి ప్రతిష్టాత్మక సినిమాలను అందించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దాంతో పాటు మరొక చిత్రం ప్రాజెక్ట్ కే అనే భారీ యాక్షన్ సినిమాకు కూడా ప్రభాస్ ఓకే చేసినట్టు తెలుస్తోంది. దీంతో సలార్ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ దీనికి సంబంధించిన షూటింగ్ మాత్రం ఇంకా 60 శాతం కూడా పూర్తి కాలేదు. దీనికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కారణం షూటింగ్లో భాగంగా ప్రభాస్ కు ఇటీవల గాయం కావడం చేత సర్జరీ నిమిత్తం ఇప్పుడు కాస్త విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో నెల వరకు కొనసాగే అవకాశం ఉండదని సినీ వర్గాల టాక్.

సలార్ చిత్రం షూటింగ్ చాలా రోజుల కిందటే మొదలైంది. దీనికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా ఎప్పుడు పూర్తయింది. హీరో ఇంట్రడక్షన్ పార్ట్ ను సింగరేణి గనుల్లో ఇప్పటికే షూట్ చేశారు. అంతేకాకుండా ఈ మూవీలో ప్రభాస్ ద్విపాత్రాభినయం కూడా చేస్తున్నాడని ఎప్పటినుంచో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల నటి శృతిహాసన్ నటించనున్న సంగతి తెలిసిందే. ఇక మరో ముఖ్య విషయం ఈ మూవీలో ప్రతి కథానాయకుడిగా జగపతి బాబు నటించనున్నాడని సమాచారం.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel