Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Banjarahills Pub Case : పబ్ కేసులో విస్తు గొలిపే విషయాలు.. ఆలస్యంగా వెలుగులోకి!

Banjarahills Pub Case : బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పబ్ పై దాడి ఘటనకు రెండు వారాల ముందే పబ్ కు డ్రగ్స్ సప్

By Vinod Kumar

Published on: April 11, 2022 6:19 AM

Updated on: April 11, 2022 7:06 AM

Banjarahills Pub Case

---Advertisement---

Banjarahills Pub Case : బంజారాహిల్స్ ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పబ్ పై దాడి ఘటనకు రెండు వారాల ముందే పబ్ కు డ్రగ్స్ సప్లై అయినట్లు పోలీసులు గుర్తించారు. పుడింగ్ అండ్ మింక్ పబ్ లో లేట్ నైట్ పార్టీ జరుగుతున్నట్లు మరో పబ్ యాజమాన్యం నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ సమాచారం ఆధారంగానే పోలీసులు దాడులు జరిపి డ్రగ్స్ ని గుర్తించారు. ఒక్కో హ్యాష్ ఆయిల్ సిగరెట్ రూ.8 వేల చొప్పున విక్రయించినట్లు తెలిసింది.

Banjarahills Pub Case
Banjarahills Pub Case

కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వీర మాచినేని అర్జున్, కిరణ్ రాజులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరు విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నగర పోలీసులు కిరణ్ రాజుకు ఈ మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పబ్ లో డ్రగ్స్ దొరికిన సమయంలో తాను అమెరికాలో ఉన్నానని కిరణ్ రాజు తెలిపినట్లు సమాచారం. అలాగే తనకు పబ్ లో పార్టనర్ షిప్ మాత్రమే ఉందని… అక్కడి కార్యకలాపాలకు తనకు ఏ సంబంధం లేదని వివరించాడు.

Advertisement

Read Also : 

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.