Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Double Murders : పెళ్లి చేయలేదని నాన్నను, బాబాయ్ ను చంపిన కుమారుడు..!

Double murders: రాఖీ పండుగ రోజు అందరూ రాఖీలు కట్టించుకుంటుండగా.. ఓ యువకుడు మాత్రం ఇంట్లో వారితో గొడవ పెట్టుకున్నాడు. తనకు పెళ్లి చేయమంటూ వాగ్వాదానికి దిగి.. తండ్రితో పాటు బాబాయిని హత్య చేశాడు. ఇంతటి దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో రాఖీ పండుగ రోజున దారుమం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో 55 సంవత్సరాల కర్రల అబ్బయ్య, అతని సోదరుడు 50 ఏళ్ల కర్రల సాయిలుని ... Read more

By Vinod Kumar

Published on: August 14, 2022 12:00 PM

Updated on: August 4, 2025 9:00 PM

---Advertisement---

Double murders: రాఖీ పండుగ రోజు అందరూ రాఖీలు కట్టించుకుంటుండగా.. ఓ యువకుడు మాత్రం ఇంట్లో వారితో గొడవ పెట్టుకున్నాడు. తనకు పెళ్లి చేయమంటూ వాగ్వాదానికి దిగి.. తండ్రితో పాటు బాబాయిని హత్య చేశాడు. ఇంతటి దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో రాఖీ పండుగ రోజున దారుమం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో 55 సంవత్సరాల కర్రల అబ్బయ్య, అతని సోదరుడు 50 ఏళ్ల కర్రల సాయిలుని అబ్బయ్య కొడుకు కర్ర సతీష్ దారుణంగా హత్య చేశాడు.

కని పెంచిన తండ్రితో పాటు బాబాయ్ సాయిలని సతీష్ పారతో తలపై బలంగా కొట్టి చంపేశాడు. ఈ జంట హత్యలకు కుటుంబ తగాదాలే కారణం అని తెలుస్తోంది. అయితే నిందితుడు సతీష్ కు మతిస్థిమితం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తనకు పెళ్లి చేయమని గత కొంత కాలంగా తండ్రిని వేధిస్తున్నాడు. పండుగ నాడు కూడా తనకు కచ్చితంగా పెళ్లి చేయాల్సిందేనని వెంట పడ్డాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో తండ్రి కాస్త సీరియస్ అయ్యాడు. అదే ఆయన పాలిట శాపంగా మారి తనతో పాటు తమ్ముడి ప్రాణాలు పోవడానికి కారణం అయింది.

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.