Technews

RBI 50 Note : రూ. 50 నోటుపై బిగ్ అప్‌డేట్.. ఆర్బీఐ కొత్త నోటు తీసుకొస్తోంది.. పాత నోట్లు చెల్లుతాయా?

RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూ. 50 బ్యాంక్ నోటును జారీ చేయనుంది. ఈ రూ. 50 నోటుకు సంబంధించి కొత్త సమాచారాన్ని వెల్లడించింది. దేశ కేంద్ర బ్యాంకు త్వరలో కొత్త రూ.50 నోట్లను జారీ చేయనుంది. ఈ నోట్లపై కొత్త ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో కొత్తగా నియమితులైన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన రూ.50 నోట్లను విడుదల చేయనుంది. డిసెంబర్ 2024లో శక్తికాంత దాస్ స్థానంలో మల్హోత్రా నియమితులయ్యారు.

Advertisement

“ఈ నోట్ల డిజైన్ మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ. 50 నోట్ల మాదిరిగానే ఉంటుంది” అని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన అన్ని రూ. 50 డినామినేషన్ నోట్లు చట్టబద్ధంగా చెలామణిలో కొనసాగుతాయి.

RBI 50 Note : సంజయ్ మల్హోత్రా ఎవరు? :

2022 సంవత్సరంలోనే, సంజయ్ మల్హోత్రాను కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ గవర్నర్ పదవికి నామినేట్ చేసింది. ఇప్పటివరకు ఆయన ఆర్థిక సేవల విభాగం (DFS) కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ కు చెందిన సీనియర్ అధికారి. నవంబర్ 2020లో, ఆయన REC ఛైర్మన్, ఎండీగా నియమితులయ్యారు. ఆయన కొంతకాలం ఇంధన మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశారు.

Advertisement

Read Also : Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త.. 3 ఎకరాల వరకు ‘రైతు భరోసా’విడుదల.. మీ అకౌంట్లు చెక్ చేసుకోండి!

ప్రస్తుతం ఉన్న అన్ని రూ. 50 నోట్లు ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయి. మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ 50 రూపాయల నోటు 66 మిమీ x 135 మిమీ కొలతలు కలిగి ఉండి ఫ్లోరోసెంట్ నీలిరంగు బేస్ కలర్ కలిగి ఉంటుంది. వెనుక భాగంలో హంపి రథంతో ఫొటో ఉంటుంది. దేశం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ఇది సూచిస్తుంది. రూ. 2వేల రూపాయల నోట్ల విషయానికొస్తే.. వాటిని నిషేధించి ఏడాదిన్నర దాటింది.

Advertisement

అయినప్పటికీ ప్రజలు ఇప్పటికీ గణనీయమైన మొత్తాన్ని కలిగి ఉన్నారు. జనవరి 31, 2025 నాటికి, ఈ గులాబీ నోట్లలో 98.15 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని, దాదాపు రూ. 6,577 కోట్లు ఇప్పటికీ ప్రజలలో చెలామణిలో ఉన్నాయని ఆర్‌బిఐ ఇటీవల తెలిపింది.

డిసెంబర్ 31 నాటికి, ఆర్బీఐ డేటా ప్రకారం.. మొత్తం రూ.6,691 కోట్ల నోట్లు చెలామణిలో ఉన్నాయి. మే 19, 2023న, సెంట్రల్ బ్యాంక్ తన క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ.2వేల నోట్లను దశలవారీగా రద్దు చేయాలని నిర్ణయించింది.

Advertisement
Tufan9 Telugu News

Tufan9 Telugu News providing All Categories of Content from all over world

Recent Posts

Summer AC Tips : ఎండలు బాబోయ్.. AC ఆన్ చేసే ముందు జాగ్రత్త.. మీ విద్యుత్ ఆదా చేసే పవర్‌ఫుల్ టిప్స్ మీకోసం.. !

Summer AC Tips : ఏదైనా ఏసీని కొనుగోలు చేసే ముందు ఈ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి. మీకోసం 4…

1 week ago

Poco C71 Launch : పోకో కొత్త C71 ఫోన్ కిర్రాక్.. ధర తక్కువ.. ఫీచర్లు ఎక్కువ..!

Poco C71 Launch : భారత మార్కెట్లో Poco C71 మోడల్ 4GB + 64GB బేస్ కాన్ఫిగరేషన్ ధర…

1 week ago

Realme 13 Pro Price : కొత్త ఫోన్ కేక.. రియల్‌మి 13ప్రోపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.8వేలు తగ్గింపు

Realme 13 Pro Price : రియల్‌మి 13 ప్రో ఫోన్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర…

1 week ago

CSK vs RCB : చెన్నైపై బెంగళూరు గెలుపు.. ఎన్ని సిక్సర్లు బాదారు, పాయింట్ల పట్టికలో ఎవరు టాప్ అంటే?

CSK vs RCB : ఐపీఎల్ 2025లో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చెన్నై సూపర్…

3 weeks ago

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం IPTV సర్వీసు ప్లాన్లు.. 350 లైవ్ టీవీ ఛానల్స్, 26 OTT యాప్స్..

Airtel IPTV Plans : ఎయిర్‌టెల్ 2వేల నగరాల్లో IPTV (ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్) సర్వీసును ప్రవేశపెట్టింది. హై-స్పీడ్ ఇంటర్నెట్,…

3 weeks ago

Spinach : పాలకూర ఎందుకు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే రోజూ ఇదే తింటారు..!

Spinach : పాలకూర ఆరోగ్యకరమైన కూరగాయలలో వస్తుంది. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండి…

3 weeks ago

This website uses cookies.