Politics

Rythu Bharosa : మీకు రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదా? ఆందోళన అక్కర్లేదు.. ఎందుకంటే?

Rythu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. జనవరి 26న రిపబ్లిక్ డే రోజున రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ, రైతు భరోసా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకాలు ప్రారంభం నుంచే లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. రైతు భరోసా పథకం కింద కూడా పంట పెట్టుబడి సాయంగా ఎకరం వరకు సాగు చేసే భూములకు ఫిబ్రవరి 5న నిధులు విడుదలయ్యాయి.

Advertisement

రాష్ట్రంలో మెుత్తంగా 17.03 లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు విడుదల చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ముందుగా తొలి విడతలో భాగంగా 563 గ్రామాల్లోనే రైతుభరోసా డబ్బులు విడుదల చేశామన్నారు. రెండో విడత కింద తెలంగాణలోని ఎకరం సాగు భూములు కలిగిన రైతులకు రూ.6 వేల చొప్పున డబ్బులు విడుదల చేసినట్టు చెప్పారు. నల్గొండ జిల్లాలోని 1.55 లక్షల మంది రైతులకు, సిద్దిపేట జిల్లాలో 1.20 లక్షల రైతులకు, మెదక్‌ జిల్లాలో 1.15 లక్షల రైతులకు, సంగారెడ్డి జిల్లాలో 1.15 లక్షల మంది రైతుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడ్డాయని చెప్పారు.

Advertisement

Rythu Bharosa : ప్రతి సాగు ఎకారాకు రైతు భరోసా అందుతుంది :

ఇప్పటికీ అనేక మంది తెలంగాణ రైతులు తమ బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడలేదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సర్కార్ నుంచి ముఖ్యమైన ప్రకటన వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారమే.. రైతుభరోసాను పెట్టుబడి సాయంగా నిధులను రైతులకు నిర్ణీత కాలవ్యవధిలో చెల్లించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం ఎకరం వరకు మాత్రమే డబ్బులు విడుదల చేసినట్టు పేర్కొంది. మిగిలిన రైతులందరికి అతి త్వరలోనే విడుదల చేయనుంది. రైతులు తమ రైతుభరోసా డబ్బుల విషయంలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని, సాగులోని ప్రతి ఎకరాకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

రైతు భరోసాకు సంబంధించి పంట పెట్టుబడికి గత జనవరి 27వ తేదీ నుంచి ఇప్పటివరకు 21,45,330 మంది రైతులకు రూ.1,126 కోట్లు జమ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గత బుధవారం రోజునే ఎకరం సాగు చేస్తున్న 17.03 లక్షల రైతుల బ్యాంకు అకౌంట్లలో రూ.6 వేల చొప్పున డబ్బులు క్రెడిట్ అయ్యాయి. అతి త్వరలోనే మరో 2 నుంచి 3 ఎకరాల రైతులకు కూడా వచ్చే సాగులో ప్రతి ఎకరాకు డబ్బులు పడనున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని, ఆన్‌గోయింగ్ స్కీమ్ కావడంతో ఎన్నికల సంఘం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని సమాచారం.

Advertisement

Read Also : Rythu Bharosa : రైతన్నలకు శుభవార్త.. రైతు భరోసా డబ్బులు పడ్డాయి.. ఇప్పుడే మీ బ్యాంకు అకౌంట్లు చెక్ చేసుకోండి!

Advertisement
Advertisement
Tufan9 Telugu News

Tufan9 Telugu News providing All Categories of Content from all over world

Recent Posts

RBI 50 Note : రూ. 50 నోటుపై బిగ్ అప్‌డేట్.. ఆర్బీఐ కొత్త నోటు తీసుకొస్తోంది.. పాత నోట్లు చెల్లుతాయా?

RBI 50 Note : కొత్త రూ. 50 కరెన్సీ నోటు వస్తోంది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)…

8 hours ago

Rythu Bharosa : తెలంగాణ రైతులకు షాక్.. రైతు భరోసా జాబితా నుంచి 8 లక్షల ఎకరాలు తొలగింపు..!

Rythu Bharosa : రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి మద్దతును అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన…

9 hours ago

Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త.. 3 ఎకరాల వరకు ‘రైతు భరోసా’విడుదల.. మీ అకౌంట్లు చెక్ చేసుకోండి!

Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త.. మీకు మూడు ఎకరాలు ఉన్నాయా? అయితే, మీ బ్యాంకు అకౌంట్లలో రైతు…

9 hours ago

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? జర జాగ్రత్త.. ఈ పని చేయకుంటే కార్డు రద్దు అవుతుంది.. ఇప్పుడే చెక్ చేసుకోండి!

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, జర జాగ్రత్త.. రేషన్ కార్డు పథకంలో ఎప్పటికప్పుడూ కొత్త…

6 days ago

Rythu Bharosa : రైతన్నలకు శుభవార్త.. రైతు భరోసా డబ్బులు పడ్డాయి.. ఇప్పుడే మీ బ్యాంకు అకౌంట్లు చెక్ చేసుకోండి!

Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…

1 week ago

Jeera Saunf water : సోంపు, జీలకర్ర పొడితో ఈ వ్యాధులకు చెక్ పెట్టొచ్చు.. ఎప్పుడు, ఎలా తినాలో తెలుసా?

Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…

1 week ago

This website uses cookies.